News January 28, 2025
తొలిరోజే జిల్లా ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాదవ్ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. సోమవారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో 75 ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి, సకాలంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు.
Similar News
News December 9, 2025
ఏలూరు జిల్లా చరిత్రలోనే మొదటిసారి..!

ఏలూరు బార్ అసోసియేషన్ నుంచి మహిళా న్యాయవాది జిల్లా అదనపు న్యాయమూర్తిగా ఎంపికవడం తొలిసారి అని ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారామ్ పేర్కొన్నారు. జిల్లా అదనపు న్యాయమూర్తిగా ఎంపికైన గుంటూరు దుర్గాపూర్ణిమను అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఇది ఒక చరిత్రాత్మక ఘటన అన్నారు.
News December 9, 2025
TPT: ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం.. ఫోన్పే చేయడంతోనే!

తిరుపతిలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్ ఓ బాలికను అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ర్యాపిడో బుక్ చేసినప్పుడు ఆ బాలిక ఫోన్ పే ద్వారా నగదు చెల్లించింది. ఆ నంబర్తో బాలికకు కాల్ చేసి ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. తర్వాత సాయి కుమార్ తన అక్కతో ఫోన్ మాట్లాడించాడు. ఫ్రెండ్స్గా ఉందామని.. ఏ అవసరం వచ్చినా కాల్ చేయడమన్నాడు. దీంతో బాలిక సాయం అడిగితే తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సమాచారం.
News December 9, 2025
మహిళా పోలీసులకు కొత్త బాధ్యతలు: విశాఖ సీపీ

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి 430 మంది మహిళా పోలీసులతో మంగళవారం సమావేశయ్యారు. ఈ కార్యక్రమంలో వారి విధులను ఖరారు చేశారు. ఇకపై రెగ్యులర్ పోలీసులతో కలిసి పనిచేసేలా డేటా ఎంట్రీ, దర్యాప్తు సాయం, కౌన్సెలింగ్, సమాచార సేకరణ వంటి 10 రకాల కీలక బాధ్యతలను వారికి ప్రతిపాదించారు. బదిలీలు, ఐడీ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామని సీపీ హామీ ఇచ్చారు.


