News July 1, 2024

తొలిరోజే పింఛన్ 100 శాతం పంపిణీ పూర్తిచేయాలి: క‌లెక్ట‌ర్ సృజ‌న

image

జులై 1వ తేదీన ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద పెన్ష‌న్ల మొత్తాన్ని ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల వ‌ద్దే అందించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న ఆదేశించారు. ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద చేప‌ట్టే సామాజిక భ‌ద్ర‌తా పెన్ష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై క‌లెక్ట‌ర్ టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. తొలిరోజే 100 శాతం పంపిణీ పూర్తిచేసేలా కృషిచేయాల‌న్నారు.

Similar News

News January 3, 2026

గుడివాడ ఫ్లైఓవర్‌కు రైల్వే అనుమతులు.. కానీ.!

image

గుడివాడలోని రైల్వేగేట్లపై రూ.330కోట్లతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ల పనులకు అనుమతులు లభించాయి. ఇప్పటికే 70% పనులు పూర్తి కాగా, భూసేకరణ చెల్లింపులు తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన పనులను రైల్వే అధికారులు నేరుగా పర్యవేక్షించాల్సి ఉంది. సాంకేతిక అనుమతుల ప్రక్రియ దృష్ట్యా ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో 6నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరికి ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

News January 2, 2026

పెడన: యువకుడి సూసైడ్

image

పెడన మండలం చెన్నూరు గ్రామంలో యర్రంశెట్టి వెంకటేష్‌ (28) తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. పెడన ఎస్‌ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 2, 2026

కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ప్రశంసించిన చంద్రబాబు

image

కలెక్టర్ డీకే బాలాజీని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మలిచిన తీరు అభినందనీయమన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.