News March 3, 2025

తొలి దళిత లోక్‌సభ స్పీకర్‌ బాలయోగిది తూ.గో.జిల్లానే

image

తొలి దళిత లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన GMC బాలయోగి ఐ.పోలవరం(M) ఎదురులంకలో జన్నించారు. కాకినాడలో పోస్ట్ గ్రాడ్యుయేట్, విశాఖలో న్యాయ పట్టా పొందారు. 1980లో ఆయన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1987లో తూ.గో. ప్రజా పరిషత్ ఛైర్మన్‌గా, ముమ్మిడివరం నుంచి ఉపఎన్నికలో శాసనసభకు ఎన్నికయ్యారు. ఏపీలో విద్యామంత్రిగా నియమితులయ్యారు. 2002 మార్చి 3లో కైకలూరులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నేడు ఆయన వర్ధంతి.

Similar News

News December 5, 2025

ప్రైవేటుపరం దిశగా కరీంనగర్- 2 డిపో..!

image

KNR రీజియన్ పరిధిలో 11 RTC డిపోలుండగా అందులో KNR-2 డిపో ప్రైవేట్‌ పరంవైపు అడుగులేస్తోంది. ఈ డిపోలో ప్రైవేట్ నిర్వహణలో నడుస్తున్న 100 ఎలక్ట్రిక్ బస్సులు, హైర్ విత్ బస్సెస్ 32 ఉండగా RTC బస్సులు కేవలం 20 మాత్రమే ఉన్నాయి. KNR-2 డిపోలో పనిచేస్తున్న 51మంది ఉద్యోగులను ఇప్పటికే ఇతర డిపోల్లోని వివిధ విభాగాలకు బదిలీ చేశారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం మహిళా గ్రూపులకు మరో 40 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించనుంది.

News December 5, 2025

జాతీయ జెంబోరీలో అన్నమయ్య జిల్లా విద్యార్థుల ప్రతిభ

image

లక్నోలో జరిగిన 19వ జాతీయ జెంబోరీలో పాల్గొని ప్రతిభ కనబరిచిన అన్నమయ్య జిల్లా 62 మంది స్కౌట్స్ & గైడ్స్ విద్యార్థులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీఈవో సుబ్రహ్మణ్యం అభినందించారు. మార్చ్‌పాస్ట్, బ్యాండ్, క్యాంప్ ఫైర్, టెంట్ ఏర్పాటు, పైరింగ్ వంటి విభాగాల్లో విద్యార్థులు సర్టిఫికెట్లు సాధించారు. శిబిరం ద్వారా క్రమశిక్షణ, బృందస్ఫూర్తి వంటి విలువలు నేర్చుకున్నామని విద్యార్థులు తెలిపారు.

News December 5, 2025

ప్రైవేటుపరం దిశగా కరీంనగర్- 2 డిపో..!

image

KNR రీజియన్ పరిధిలో 11 RTC డిపోలుండగా అందులో KNR-2 డిపో ప్రైవేట్‌ పరంవైపు అడుగులేస్తోంది. ఈ డిపోలో ప్రైవేట్ నిర్వహణలో నడుస్తున్న 100 ఎలక్ట్రిక్ బస్సులు, హైర్ విత్ బస్సెస్ 32 ఉండగా RTC బస్సులు కేవలం 20 మాత్రమే ఉన్నాయి. KNR-2 డిపోలో పనిచేస్తున్న 51మంది ఉద్యోగులను ఇప్పటికే ఇతర డిపోల్లోని వివిధ విభాగాలకు బదిలీ చేశారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం మహిళా గ్రూపులకు మరో 40 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించనుంది.