News March 3, 2025

తొలి దళిత లోక్‌సభ స్పీకర్‌ బాలయోగిది తూ.గో.జిల్లానే

image

తొలి దళిత లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన GMC బాలయోగి ఐ.పోలవరం(M) ఎదురులంకలో జన్నించారు. కాకినాడలో పోస్ట్ గ్రాడ్యుయేట్, విశాఖలో న్యాయ పట్టా పొందారు. 1980లో ఆయన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1987లో తూ.గో. ప్రజా పరిషత్ ఛైర్మన్‌గా, ముమ్మిడివరం నుంచి ఉపఎన్నికలో శాసనసభకు ఎన్నికయ్యారు. ఏపీలో విద్యామంత్రిగా నియమితులయ్యారు. 2002 మార్చి 3లో కైకలూరులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నేడు ఆయన వర్ధంతి.

Similar News

News November 28, 2025

SVU: పీజీలో సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU)లో పీజీ (PG) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ భూపతి నాయుడు పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీన స్పాట్ అడ్మిషన్ల ప్రవేశాల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇందుకు PGCET పాస్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో నేరుగా వర్సిటీలో హాజరుకావాలని ఆయన సూచించారు.

News November 28, 2025

శరవేగంగా అమరావతి పనులు: మంత్రి లోకేశ్

image

AP: రైతుల త్యాగ ఫలితమే అమరావతి అని మంత్రి లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వం దీన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో 1,631 రోజులపాటు రైతులు ఉద్యమం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.

News November 28, 2025

NLG: దేశంలోనే అతిపెద్ద భూస్కామ్ ఇదే: మాజీ మంత్రి

image

కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీదైన భూములను ఇష్టం వచ్చినట్లుగా, నచ్చినోళ్లకు కట్టబెడుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట MLA జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. దీక్ష దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలోనే అతిపెద్ద భూ స్కామ్ మన తెలంగాణలో జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.​కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పాలసీల పేరుతో భారీగా స్కామ్‌లు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.