News March 18, 2025

త్రేతాయుగం నాటి ఆలయం.. మీరు వెళ్లారా..!

image

హీరో నితిన్ అశ్వారావుపేట సరిహద్దులో ఉన్న గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని స్థానికులు చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలు, గుబ్బలుగా ఉన్న గుహలో వెలవడంతో గుబ్బల మంగమ్మగా ప్రసిద్ధి చెందిందని అంటున్నారు. గిరిపుత్రులే పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయానికి అశ్వారావుపేట నుంచి పూచికపాడు, రామచంద్రాపురం మీదుగా వెళ్లొచ్చు.

Similar News

News March 18, 2025

కావలి గ్రీష్మ రాజీనామాకు ఆమోదం

image

AP: ఏపీ మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పదవికి కావలి గ్రీష్మ ఈ నెల 9న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించగానే ఆమె రాజీనామా చేశారు. ఇటీవల ఆమె ఆ కోటాలో MLCగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం గ్రీష్మ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News March 18, 2025

సీఎం తిరుపతి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

image

సీఎం చంద్రబాబు ఈనెల 20, 21వ తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. 20వ తేదీ తిరుపతి మీదుగా తిరుమల చేరుకుంటారు. 21వ తేదీ శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. రేణిగుంట విమానాశ్రయంలో అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటనలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను అధికారులకు వివరించారు.

News March 18, 2025

జోగులాంబ గద్వాల జిల్లా నేటి ముఖ్య వార్తలు

image

@గద్వాల: ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు@ జమ్మిచెడు జమ్ములమ్మకు విశేష పూజలు.@ ఉత్తమ ఫలితాలు సాధించాలి:ఎమ్మెల్యే బండ్ల @మల్దకల్: శాశ్వత సర్వేయర్‌ను నియమించాలి.CPI @మానవపాడు:GOVT స్కూల్ పిల్లలు సత్తా చాటాలి.@ఇటిక్యాల:NREGS పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ @అయిజ: అందరూ రండి..రక్తదానం చేయండి.@వడ్డేపల్లి: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురవొద్దు.@గట్టు: ఎండ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

error: Content is protected !!