News April 11, 2025
త్వరలో ఏనుగుల తరలింపు: మంత్రి

ఏనుగులను ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి త్వరలో తరలిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పంటలకు భారీ నష్టం వాటిల్లిందని, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఏనుగులను తరలించేందుకు కుంకీ ఏనుగులు వస్తాయని మంత్రి తెలిపారు. కురుపాం మండలంలోని మారుమూల గ్రామాల్లో రెండు రోడ్లను మంత్రి ప్రారంభించారు.
Similar News
News November 13, 2025
గన్నవరం: జాతీయ రహదారిపై ప్రమాదం.. స్పాట్ డెడ్.!

గన్నవరం (M)కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైకును వెనుక నుంచి ఢీకొట్టడంతో, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంతోష్ (31)అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ గూడవల్లి చైతన్య కళాశాల హాస్టల్లో వంట మాస్టర్లుగా పనిచేసేవారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గన్నవరం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News November 13, 2025
HYD: చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం కాదు

చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం ఒక్కటే కాదని.. దాని అవసరాలు నెరవేరే విధంగా వాటిని తీర్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శిల్పకళా వేదికలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించిన సౌత్ ఇండియా CSR సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CSR నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News November 13, 2025
ప్రతిష్టాత్మక కమిటీలో మచిలీపట్నం ఎంపీకి స్థానం

మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి మరో ప్రతిష్టాత్మక కమిటీలో చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు-2025 జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు సంయుక్త కమిటీ సభ్యులుగా బాలశౌరిని నియమించారు. ప్రతిష్టాత్మకమైన కమిటీలో చోటు దక్కినందుకు ఎంపీ బాలశౌరి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు కృతజ్ఞతలు తెలియజేశారు.


