News April 11, 2025
త్వరలో ఏనుగుల తరలింపు: మంత్రి

ఏనుగులను ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి త్వరలో తరలిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పంటలకు భారీ నష్టం వాటిల్లిందని, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఏనుగులను తరలించేందుకు కుంకీ ఏనుగులు వస్తాయని మంత్రి తెలిపారు. కురుపాం మండలంలోని మారుమూల గ్రామాల్లో రెండు రోడ్లను మంత్రి ప్రారంభించారు.
Similar News
News November 17, 2025
గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: ఎస్పీ

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. అందిన ఫిర్యాదుల్లో భూ వివాదాలకు సంబంధించి 6, కుటుంబ తగాదాలకు సంబంధించి 1, గొడవలకు సంబంధించి 2, ఇతర అంశాలకు సంబంధించి 6 ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు.
News November 17, 2025
గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: ఎస్పీ

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. అందిన ఫిర్యాదుల్లో భూ వివాదాలకు సంబంధించి 6, కుటుంబ తగాదాలకు సంబంధించి 1, గొడవలకు సంబంధించి 2, ఇతర అంశాలకు సంబంధించి 6 ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు.
News November 17, 2025
కిల్లింగ్ క్యాన్సర్: SU212తో ప్రాణాంతక కణాలకు ‘ఆహారం’ కట్!

అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ (TNBC) చికిత్సలో కీలక ముందడుగు పడింది. పరిశోధకులు SU212 అనే అణువును కృత్రిమంగా రూపొందించారు. ఇది క్యాన్సర్ కణాలు జీవించడానికి అవసరమైన ENO1 అనే ఎంజైమ్ను లక్ష్యంగా చేసుకుంటుంది. స్వయంగా నాశనమయ్యేలా చేయడం ద్వారా ఇది కణాలకు శక్తి సరఫరాను ఆపివేసి, కణితి పెరుగుదలను & వ్యాప్తిని అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


