News June 29, 2024

త్వరలో మరో రెండు పంప్ హౌస్‌లు ట్రయల్ రన్ : కలెక్టర్

image

అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను కలెక్టర్‌ జితేశ్‌ శుక్రవారం సందర్శించారు. ఆయనకు జలవనరులశాఖ అధికారులు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. పూసుగూడెం, కమలాపురం వద్దనున్న పంప్‌హౌస్‌లు ట్రయల్‌ రన్‌కు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలోని 104 కిలోమీటర్ల సీతారామ ప్రధాన కాల్వ ద్వారా జలాలను వదిలేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు.

Similar News

News December 4, 2025

ఖమ్మం: మొదటి విడత ఎన్నికకు 1,740 పోలింగ్ కేంద్రాలు

image

మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న నిర్వహించనున్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. పోలింగ్ కోసం 1,740 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,089 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. 2,089 మంది పోలింగ్ ఆఫీసర్లు, 2,551 మంది ఓపీఓలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News December 4, 2025

ఖమ్మంలో 10నుంచి 12 వరకు బాలోత్సవం పోటీలు

image

ఖమ్మం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఎంట్రీల కోసం 94903 00672ను సంప్రదించాలని కోరారు

News December 4, 2025

ఖమ్మంలో 10నుంచి 12 వరకు బాలోత్సవం పోటీలు

image

ఖమ్మం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఎంట్రీల కోసం 94903 00672ను సంప్రదించాలని కోరారు