News January 29, 2025

త్వరలో మరో 2 కొత్త ఐటీ పార్కులు: మంత్రి శ్రీధర్ బాబు

image

త్వరలో హైదరాబాద్‌లో మరో 2 కొత్త ఐటీ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు. హైటెక్ సిటీ మాదిరిగా రెండు కొత్త ఐటీ పార్కులను అభివృద్ధి చేస్తామని అన్నారు. పార్కుల ఏర్పాటు కొరకు స్థల పరిశీలన జరుగుతుందన్నారు. హైదరాబాద్‌ను వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కేంద్రంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త ఐటీ పార్కులను అభివృద్ధి చేయనుంది.

Similar News

News November 12, 2025

నిర్మల్: మహిళపై లైంగిక దాడి.. ఇద్దరికి 20 ఏళ్ల శిక్ష

image

స్నేహితుడి భార్యను అపహరించి లైంగిక దాడి చేసిన ఇద్దరు నేరస్థులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ నిర్మల్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీవాణి బుధవారం తీర్పు వెలువరించారు. ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్‌కు చెందిన ధర్మపురి, గంగాధర్ 2017లో ఈ నేరానికి పాల్పడ్డారు. ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేయగా విచారణలో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైంది.

News November 12, 2025

MBNR: భరోసా ఏడాది పూర్తి.. మొత్తం 163 కేసులు

image

మహబూబ్‌నగర్‌లోని భరోసా కేంద్రం స్థాపించబడి నేటికీ ఏడాది పూర్తి అయింది. మొత్తం 163 కేసులు భరోసా కేంద్రానికి అందాయి. CWC వారి భాగస్వామ్యంతో సహకారంతో POCSO కేసులు-117, రేప్ కేసులు-24, ఇతర కేసులు-22 వచ్చాయని, కౌన్సెలింగ్-218, పరిహారాలు-119 అందయన్నారు. DWO సహకారంతో ఇప్పటివరకు మొత్తం 45 బాధితులకు రూ.11,25,000 విలువైన పరిహారం అందించామని అధికారులు వెల్లడించారు.

News November 12, 2025

భారత్‌కు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: ఇజ్రాయెల్ పీఎం

image

ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనను ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఖండించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. భారత్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ‘భారత్, ఇజ్రాయెల్ శాశ్వత సత్యాలపై ఆధారపడిన పురాతన నాగరికతలు. మన నగరాలపై దాడులు జరగొచ్చు. కానీ అవి మనల్ని భయపెట్టలేవు. ఇరు దేశాల వెలుగు శత్రువుల చీకట్లను తరిమేస్తుంది’ అని ట్వీట్ చేశారు.