News July 1, 2024
త్వరలో మహిళలకు తీపికబురు: కోన
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి హామీ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే ప్రభుత్వం తీపికబురు చెబుతుందని డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ పేర్కొన్నారు. మండపేటలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనలో మంత్రులు గంగిరెద్దుల్లా తలలు ఊపడం తప్పించి ఏమీ చేయలేదని అన్నారు. కూటమి మంత్రులకు సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని ఆయన వెల్లడించారు.
Similar News
News September 21, 2024
తూ.గో మీదుగా నడిచే రైళ్లు రద్దు
ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం తెలిపింది. కడియం-కొవ్వూరు స్టేషన్ల మధ్య పనులతో ఈ నెల 29న తిరుపతి-విశాఖ, 30న విశాఖ-తిరుపతి, విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ, విశాఖ-గుంటూరు, గుంటూరు-విశాఖ, 29, 30 తేదీల్లో గుంటూరు-విశాఖ, విజయవాడ-రాజమండ్రి, అక్టోబర్ 1న విశాఖ-గుంటూరు, 30న విజయవాడ-రాజమండ్రి, రాజమండ్రి విశాఖ, విశాఖ-రాజమండ్రి రైళ్లను రద్దు చేశారు.
News September 21, 2024
తూ.గో: హత్యాయత్నం కేసు.. భర్తకు మూడేళ్ల జైలు శిక్ష
అదనపు కట్నం కోసం భార్యని వేధించడంతో పాటు ఆమెపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఏలూరుకు చెందిన సంస్కృతం లెక్చరర్ రాజేశ్వరరావుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ పిఠాపురం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బాబు శుక్రవారం తీర్పు చెప్పారు. తొండంగి మండలం బెండపూడికి చెందిన జువాలజీ లెక్చరర్ మధురాక్షిపై ఆమె భర్త 2020 సెప్టెంబర్ 10న తునిలో కత్తితో దాడి చేసి, హత్య చేసేందుకు యత్నించాడు.
News September 21, 2024
23న కాకినాడలో జాబ్ మేళా
ఈ నెల 23వ తేదీన కాకినాడ వికాస కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ మేళాలో ఐఅండ్వీ బయో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ జాబ్మేళాకు పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు.