News April 15, 2025
త్వరలో విజయవాడ నుంచి సీ ప్లేన్ సేవలు

విజయవాడ నుంచి శ్రీశైలం, హైదరాబాద్కు సీ ప్లేన్ సేవలు ప్రారంభించేలా ప్రభుత్వం సన్నాహాలు పూర్తిచేసింది. దీని నిర్వహణకు అవసరమైన DPRను సంబంధిత సంస్థ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పున్నమిఘాట్ సమీపంలో సీ ప్లేన్ నిర్వహణకు అనుగుణంగా ఏరోడ్రోమ్ ఏర్పాటు కానుండగా.. శ్రీశైలం డ్యామ్, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద సీ ప్లేన్ బేస్ సైతం సిద్ధం చేస్తున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.
Similar News
News December 9, 2025
నేషనల్ కెమికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

పుణేలోని CSIR-నేషనల్ కెమికల్ లాబోరేటరీలో 34 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12 నుంచి జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. టెక్నీషియన్కు నెలకు రూ.40వేలు, టెక్నికల్ అసిస్టెంట్కు రూ.72,000 చెల్లిస్తారు. వెబ్సైట్: http://recruit.ncl.res.in/
News December 9, 2025
చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే: పేర్ని నాని

AP: వ్యవసాయం, ధాన్యాగారంగా APకి ఉన్న బ్రాండును దెబ్బతీసింది CM చంద్రబాబేనని మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రైతును గుడ్డికన్నుతో చూడటం చంద్రబాబు విధానం. ఆయన ఎప్పటికీ రైతు వ్యతిరేకే. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. 18నెలల్లోనే రూ.2.66లక్షల కోట్ల అప్పుచేశారు. అప్పులు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? దేశ GDPలో AP వాటా ఎంత?’ అని ప్రశ్నించారు.
News December 9, 2025
ప్రకాశం డీఈవో కిరణ్ కుమార్ బదిలీ

ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఈవోల సాధారణ బదిలీలలో ప్రకాశం జిల్లా డీఈవో కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాలకు బదిలీ కాగా, ఆయన స్థానంలో గుంటూరు జిల్లా డీఈవో సీవీ రేణుక నియమితులయ్యారు. త్వరలోనే ప్రకాశం డీఈవోగా రేణుక బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.


