News April 15, 2025
త్వరలో విజయవాడ నుంచి సీ ప్లేన్ సేవలు

విజయవాడ నుంచి శ్రీశైలం, హైదరాబాద్కు సీ ప్లేన్ సేవలు ప్రారంభించేలా ప్రభుత్వం సన్నాహాలు పూర్తిచేసింది. దీని నిర్వహణకు అవసరమైన DPRను సంబంధిత సంస్థ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పున్నమిఘాట్ సమీపంలో సీ ప్లేన్ నిర్వహణకు అనుగుణంగా ఏరోడ్రోమ్ ఏర్పాటు కానుండగా.. శ్రీశైలం డ్యామ్, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద సీ ప్లేన్ బేస్ సైతం సిద్ధం చేస్తున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.
Similar News
News November 21, 2025
NZB: హమారా ‘నిఖత్’ హ్యాట్రిక్ విన్నర్

గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. నిఖత్ 51 కేజీల విభాగంలో తైవాన్ క్రీడాకారిణిపై 5-0తో గెలిచింది. దీంతో వరుసగా 3 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022, 2023, 2025 సంవత్సరాల్లో జరిగిన టోర్నీల్లో బంగారు పతకం గెలుపొందింది. 2024లో ఒలింపిక్ క్రీడల వల్ల ఎలాంటి టోర్నీలు జరగ లేదు.
News November 21, 2025
Way2Newsలో వార్త.. నేడు మంత్రి పర్యటన

రాజధాని గ్రామాల్లో గత ప్రభుత్వంలో నిర్మించిన వెల్నెస్ సెంటర్లు నిరుపయోగంగా ఉన్నాయంటూ ఈ నెల 18వ తేదీన Way2Newsలో వార్త పబ్లిష్ అయ్యింది. స్పందించిన మంత్రి నారాయణ శుక్రవారం ఉదయం 8 గంటలకు రాజధాని గ్రామాల్లో CITIIS ప్రాజెక్ట్ కింద చేపట్టిన అంగన్వాడీ సెంటర్లు, స్కూల్స్, హెల్త్ సెంటర్లను పరిశీలించనున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరి కాసేపట్లో మంత్రి పర్యటన అప్డేట్ Way2Newsలో చూడొచ్చు.
News November 21, 2025
ఇందిరా గాంధీ స్టేడియానికి అంతర్జాతీయ హంగులు.!

అంతర్జాతీయ క్రీడల నిర్వహణ కోసం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2026 చివరి నాటికి ఆధునీకరించి, 2029లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడమే లక్ష్యం. అంచనా వ్యయం రూ.53 కోట్లు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ హాల్, బాక్సింగ్ ఎరీనా, అదనపు సింథటిక్ ఔట్డోర్ కోర్టులు, వసతి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.


