News April 14, 2025
దండేపల్లిలో మహిళ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లిలో జరిగింది. ఎస్ఐ తౌసుద్దీన్ తెలిపిన వివరాలు.. దండేపల్లికి చెందిన గంగాధరి వరలక్మి (38) భర్త వేధింపులు, కుటుంబ కలహాలతో ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వరలక్ష్మి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News November 26, 2025
KMR: మద్యం మత్తులో వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య

ఎల్లారెడ్డి మండలం బాలాజీ నగర్ తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తరచూ మద్యం సేవించి వేధిస్తున్నాడనే కోపంతో నిద్రిస్తున్న భర్త రత్నావత్ తుకారం (40)ను భార్య మీన హతమార్చింది. ఈ విషయాన్ని సీఐ రాజారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 26, 2025
పర్యటకానికి కేరాఫ్ అడ్రస్గా పోలవరం జిల్లా.!

పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాలు ప్రస్తుతం అల్లూరి జిల్లాలో ఉన్నాయి. ఈ ప్రాంత వాసులు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 300KM ప్రయాణించాల్సి వస్తోంది, కొత్త జిల్లా వలన ఆ ఇబ్బంది తొలగనుంది. అలానే పాపికొండల అభయారణ్యం మొత్తం ఈ నూతన జిల్లాలో ఉండనుంది. దీంతో ఈ జిల్లా పర్యటకానికి కేరాఫ్ అడ్రస్గా మారనుంది.
News November 26, 2025
కడప: హౌసింగ్ అక్రమాల్లో చిన్న ఉద్యోగులు బలి.!

గత ప్రభుత్వంలో జిల్లాలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 6298 ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై 201 మంది సచివాలయ, మండల స్థాయి ఉద్యోగులకు జీతాలు నిలిపి వేశారు. బిల్లుల చెల్లింపులో DEE, EE, PD, SE, CE, MD స్థాయిలో ప్రతిచోట పరిశీలన జరుగుతోంది. నిర్మాణాలు పరిశీలించకుండానే అధికారులు ఏవిధంగా చెల్లింపులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


