News April 11, 2025

దండేపల్లి: గోదావరిలో స్నానానికి వెళ్లి బాలుడి మృతి

image

దండేపల్లి మండలం గూడెం గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముత్తె శివవర్మ (7) అనే బాలుడు మృతి చెందాడని దండేపల్లి ఎస్సై తౌసుద్దీన్ తెలిపారు. గురువారం సాయంత్రం శివవర్మ హనుమాన్ స్వాములతో కలిసి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడన్నారు. శివవర్మ దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన ముత్తే భీమయ్య కుమారుడని ఎస్సై వివరించారు.

Similar News

News November 11, 2025

ఢిల్లీ పేలుడు వెనుక ఉగ్ర కుట్ర!

image

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో <<18253113>>పేలుడు<<>>పై కొత్వాలి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడిగా అనుమానిస్తూ ఉపా చట్టం సెక్షన్ 16, 18 కింద రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పేలుడు నేపథ్యంలో పలు దేశాల ఎంబసీలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో ఉండొద్దని తమ దేశ పౌరులకు భారత్‌లోని యూఎస్, ఫ్రాన్స్ ఎంబసీలు అడ్వైజరీ జారీ చేశాయి.

News November 11, 2025

వనపర్తి నుంచి అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

image

వనపర్తి డిపో నుంచి అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ కోసం ఈనెల 15న రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈ యాత్రలో కాణిపాకం, వేలూరులోని మహాలక్ష్మి అమ్మవారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఈనెల 18న బస్సు తిరిగి వనపర్తికి చేరుకుంటుంది. వివరాలకు 7382829379 నంబరులో సంప్రదించవచ్చు.

News November 11, 2025

లంకలో హనుమంతుడు ఎడమ కాలు ఎందుకు మోపాడు?

image

ఆంజనేయుడు, రావణుడి అశుభాన్ని కోరి లంకలో ఎడమ పాదం మోపాడు. దాని ఫలితంగా లంక సర్వనాశనం అయింది. ఎడమ పాదం అశుభాలు, విభేదాలకు దారి తీస్తుంది. దీనికి విరుద్ధంగా, మన సంప్రదాయం ప్రకారం కుడిపాదం మోపి ఇంట ప్రవేశించడం సకల శుభాలకు, సంపదకు ప్రతీక. ముఖ్యంగా కొత్త కోడలు అత్తవారింట కుడి కాలు మోపడం వలన శాంతి, ఉన్నతి, సంతోషం కలుగుతాయి. కాబట్టి, ఇతరుల బాగును, క్షేమాన్ని కోరుతూ ఎల్లప్పుడూ కుడిపాదాన్నే ఉపయోగించాలి.