News March 11, 2025

దండేపల్లి: భర్త చనిపోయి 4 ఏళ్లు.. అయినా పెన్షన్ రాలేదు

image

తన భర్త మరణించి నాలుగు సంవత్సరాలు పూర్తయినా పెన్షన్ రావడంలేదని జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన చింతగుంట్ల పోశవ్వ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ చేసుకొని బతుకుతున్న తనకు భర్త చనిపోవడంతో బతుకుభారంగా మారిందన్నారు. కనీసం పెన్షన్ అయిన వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తే 4 ఏళ్లు గడిచినా పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

Similar News

News October 18, 2025

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

image

AP: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు యాక్ట్‌ను సవరిస్తూ <>గెజిట్<<>> జారీచేసింది. 2019లో BPS ద్వారా 2018 ఆగస్టు వరకు ఉన్న నిర్మాణాల్ని రెగ్యులరైజ్ చేశారు. అయితే తాజాగా 59,041 అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. ఇప్పుడు వీటి క్రమబద్ధీకరణకు కటాఫ్ డేట్‌ను 2025 ఆగస్టు 31గా సవరించారు. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనే దానిపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

News October 18, 2025

మెదక్: ’25లోగా IFMIS పోర్టర్‌లో నమోదు చేయాలి’

image

మెదక్ జిల్లా అధికారులు, డీడీఓలు తమ పరిధిలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల ఆధార్, పాన్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను ఈ నెల 25లోగా IFMIS పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఖజానా అధికారి అనిల్ కుమార్ మరాఠి ఆదేశించారు. వివరాలు నమోదు చేయని పక్షంలో అక్టోబర్-2025 మాసానికి సంబంధించిన జీతాలు/గౌరవ వేతనాలు అందవని ఆయన స్పష్టం చేశారు.

News October 18, 2025

ఇతిహాసాలు క్విజ్ – 39 సమాధానాలు

image

1. క్షీరసాగర మథనం సమయంలో అమృతంతో ఉద్భవించిన దేవతల వైద్యుడు ధన్వంతరి.
2. జమదగ్ని మహర్షి కుమారుడిగా పుట్టిన విష్ణు అవతారం ‘పరుశరాముడు’.
3. కాలానికి, వినాశనానికి దేవతగా కాళీ మాతను పరిగణిస్తారు.
4. క్షీరసాగర సమయంలో మొదట కాలకూట విషం వచ్చింది.
5. ఇంద్రుడి రాజధాని ‘అమరావతి’. <<-se>>#Ithihasaluquiz<<>>