News November 6, 2024
దండేపల్లి: రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి

దండేపల్లి మండలంలోని మేదర్ పేట రోడ్డుపై రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మేదరిపేటలో రోడ్డుపై ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని లక్సెట్టిపేట మండలంలోని హనుమంతుపల్లికి చెందిన బోనాల మహేశ్ (34) అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు కార్పెంటర్గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 12, 2025
8 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికలు ఈ నెల 14న ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదిలాబాద్ గ్రామీణం, మావల, బేలా, జైనథ్, సాత్నాల, భోరాజ్, తాంసీ, భీంపూర్ మండలాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలన్నారు. మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు.
News December 12, 2025
మొదటి విడతలో ఎన్నికల్లో 15 కేసులు: ADB SP

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనలో 15 కేసులు నమోదైనట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఉట్నూర్, నార్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లలో మొత్తం 50 మంది వ్యక్తులపై 15 కేసులు నమోదు చేశామన్నారు. రెండు రోజుల్లో 15 నిబంధనల ఉల్లంఘన కేసులు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిన 5 బృందాలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News December 12, 2025
ADB: రేపు అన్ని పాఠశాలలకు వర్కింగ్ డే

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు రెండవ శనివారం పని దినంగా ఉంటుందని జిల్లా ఇన్ఛార్జ్ డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 7న సెలవు ప్రకటించినందుకు బదులుగా ఈ నెల 13న అన్ని పాఠశాలలు యథావిధంగా పనిచేయాలని సూచించారు. అన్ని పాఠశాలలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.


