News January 26, 2025
దండేపల్లి వాసికి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు

దండేపల్లి మండలం ముత్యంపేటకి చెందిన శంకరయ్య- దేవక్కల పెద్ద కుమారుడు తిరుపతి శనివారం బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును రవీంద్రభారతిలో అందుకున్నారు. ఆయన 2007లో సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. 2017లో హైదరాబాద్ సీఐగా బాధ్యతలు స్వీకరించి CID విభాగంలో ఇన్స్పెక్టర్గా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రధాన పోలీసు అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలందించినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
Similar News
News October 18, 2025
ములుగు: ప్లాస్టిక్ కవర్లో మహిళ మృతదేహం

ములుగు మండలం తునికిబొల్లారం అయ్యప్ప చెరువులో ఓ ప్లాస్టిక్ కవర్లో మహిళ మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యం అయింది. వర్గల్ మండలం మీనాజీపేట్కి చెందిన మంకని బాలమణిగా(50) పోలీసులు గుర్తించారు. ఆమె ఈ నెల 10న కనిపించకుండా పోవడంతో ఆమె భర్త బాలనర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆమెను ఎవరో హత్య చేసి చెరువులో పడేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
News October 18, 2025
బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.
News October 18, 2025
NZB: కానిస్టేబుల్ హత్యపై డీజీపీ శివధర్రెడ్డి సీరియస్

నిజామాబాద్ CCS కానిస్టేబుల్ ఇ. ప్రమోద్ హత్యపై డీజీపీ శివధర్రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిందితుడు షేక్ రియాద్ను వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డిని ఘటనా స్థలానికి పంపించి పర్యవేక్షణకు ఆదేశించారు. మరణించిన కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించి, సహాయం అందించాలని సూచించారు. దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు.