News January 26, 2025

దండేపల్లి వాసికి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు

image

దండేపల్లి మండలం ముత్యంపేటకి చెందిన శంకరయ్య- దేవక్కల పెద్ద కుమారుడు తిరుపతి శనివారం బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును రవీంద్రభారతిలో అందుకున్నారు. ఆయన 2007లో సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. 2017లో హైదరాబాద్ సీఐగా బాధ్యతలు స్వీకరించి CID విభాగంలో ఇన్స్పెక్టర్‌గా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రధాన పోలీసు అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలందించినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

Similar News

News February 10, 2025

వన్డేల్లో అత్యధిక సెంచరీలు వీరివే

image

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(50) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్ (49), మూడో స్థానంలో రోహిత్ శర్మ (32) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా రికీ పాంటింగ్ (30), జయసూర్య (28), ఆమ్లా (27), ఏబీ డివిలియర్స్ (25), క్రిస్ గేల్ (25), కుమార సంగక్కర (25) కొనసాగుతున్నారు. టాప్-3లో ముగ్గురూ భారతీయులే ఉండటం విశేషం.

News February 10, 2025

కాగజ్నగర్: మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి

image

కాగజ్నగర్ సమీపంలోని పెద్దవాగు వద్ద మినీ మేడారం (సమ్మక్క, సారలమ్మ) జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి 15 వరకు జాతరను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీనివాస్, రాజయ్య, పిరిసింగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

News February 10, 2025

బెల్లంపల్లి: బార్ దాడి ఘటనలో ముగ్గురి రిమాండ్

image

బెల్లంపల్లి SRR బార్‌లో తాండూర్‌కు చెందిన బండారి వంశీ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేసిన ముగ్గురు నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు రూరల్ CI అబ్సలుద్దీన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అల్లి సాగర్, రత్నం సోమయ్య, మామిడి అన్నమయ్యలను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు CIవివరించారు.

error: Content is protected !!