News February 28, 2025

దంతాలపల్లిలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభ

image

దంతాలపల్లి మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ పాల్గొన్నారు. మండల కేంద్రంలో ర్యాలీ తీసి అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News October 20, 2025

దీపావళి శాంతియుతంగా జరుపుకోవాలి: ASF SP

image

దీపావళి వెలుగుల పండుగగా ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. గిరిజనుల సాంప్రదాయ పండుగ దండారి గుస్సాడి సందర్భంగా గిరిజన సోదరులు, కళాకారులకు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ పండుగలను శాంతి, ఐకమత్యం, సోదరభావంతో జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

News October 20, 2025

అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: ASF కలెక్టర్

image

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

News October 20, 2025

రాష్ట్రంలో తగ్గిన నూనె గింజ పంటల సాగు విస్తీర్ణం

image

AP: రాష్ట్రంలో ఈ ఏడాది నూనెగింజ పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది 17 లక్షల ఎకరాల్లో నూనెగింజల పంటలను సాగుచేయాలనుకోగా 6.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వేరుశనగతో పాటు ఇతర నూనెగింజల పంటలు సాగయ్యాయి. వరి 38.97 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పత్తి 11 లక్షల ఎకరాల్లో, చెరకు 30 వేల ఎకరాలకే పరిమితమైంది. మొక్క జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, కందులు, ఆముదం, జూట్ వంటి పంటలు లక్ష్యానికి మించి సాగయ్యాయి.