News February 3, 2025
దంతాలపల్లి: వ్యవసాయ బావిలో మృతదేహం

దంతాలపల్లి మండల కేంద్రంలోని యెల్లు సోమిరెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో గ్రామానికి చెందిన నాగిరెడ్డి రఘునందన్ రెడ్డి(69) అనే వృద్ధుడు మృతదేహం కనిపించింది. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Similar News
News December 8, 2025
ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ జూన్లో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కాగా ప్రస్తుతం ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి పని చేస్తున్నారు.
News December 8, 2025
‘బతికుండగానే తండ్రికి విగ్రహం’.. కేటీఆర్పై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ AI ఫొటోను కేటీఆర్ పోస్టు చేయడంపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టిన కేటీఆర్.. సీఎం పదవి కోసం కేసీఆర్ను కడతేర్చాలని డిసైడ్ అయినట్టున్నాడు’ అంటూ రాసుకొచ్చింది. కాగా ‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా?’ అనే ఉద్దేశంలో కేటీఆర్ పోస్ట్ చేశారని అటు బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు.
News December 8, 2025
పెద్దపల్లి : 24 ఏళ్లకు మళ్లీ ఆ రిజర్వేషన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఓదెల మండలం కొలనూర్ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ అయింది. 2001 తర్వాత గ్రామానికి ఈ రిజర్వేషన్ రావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో బరిలో ఉన్నారు. పోటీలో ఉన్న చాలామంది మొదటిసారి సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకోనున్నారు. 24 ఏళ్ల తర్వాత రిజర్వేషన్ రావడం.. ఇప్పుడుపోతే మళ్లీ ఎప్పుడు రిజర్వేషన్ వస్తుందో అన్న ఆలోచనతో అభ్యర్థులు ఈసారి తీవ్రంగానే శ్రమిస్తున్నారు.


