News February 3, 2025
దంతాలపల్లి: వ్యవసాయ బావిలో మృతదేహం

దంతాలపల్లి మండల కేంద్రంలోని యెల్లు సోమిరెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో గ్రామానికి చెందిన నాగిరెడ్డి రఘునందన్ రెడ్డి(69) అనే వృద్ధుడు మృతదేహం కనిపించింది. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Similar News
News February 8, 2026
మీరు వెజిటేరియన్సా? వీటితో ప్రొటీన్ డెఫీషియన్సీకి చెక్

3 టేబుల్ స్పూన్ల జనపనార గింజల(Hemp Seeds)తో 10గ్రా. ప్రొటీన్లు బాడీకి అందుతాయి. వీటిలో 9 రకాల అమైనో యాసిడ్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం ఉంటాయి. 28గ్రా. గుమ్మడికాయ గింజల(Pumpkin Seeds)లో 7గ్రా. ప్రొటీన్ లభిస్తుంది. వీటిలోని జింక్ ప్రొటీన్ను ఉత్పత్తి చేస్తుంది. 28గ్రా. పొద్దుతిరుగుడు విత్తనాల(Sunflower Seeds)లో 6గ్రా. ప్రొటీన్ ఉంటుంది. వీటిలోని విటమిన్ E, మెగ్నీషియం కణాలను రక్షిస్తాయి.
News February 8, 2026
చిన్న వయసులోనే మెచ్యూర్ అయితే..

చిన్న వయసులోనే పీరియడ్స్ రావడం వల్ల అమ్మాయిలు శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం ఉంది. మెచ్యూర్ కారణంగా ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి లక్షణాలు కనిపిస్తాయి. హార్మోన్ల మార్పుల కారణంగా నొప్పులు, టైప్-2 డయాబెటిస్, PCOS, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
News February 8, 2026
NRPT: ‘ఎన్నికల నేపథ్యంలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు’

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల పరిధిలో రాజకీయంగా, కుల, మత, ప్రాంతీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టిన, షేర్ చేసిన సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాను హెచ్చరించారు.


