News February 2, 2025
దక్షిణ భారత సైన్సు ఫెయిర్లో ములుగు విద్యార్థినుల ప్రతిభ

జనవరి 21 నుంచి 25 వరకు పుదుచ్చేరిలో జరిగిన దక్షిణ భారత సైన్స్ ఫెయిర్లో ములుగులోని సాధన హై స్కూల్ విద్యార్థినులు లక్ష్మి ప్రసన్న, గౌతమిలు ప్రతిభ కనబరిచి స్పెషల్ ప్రైజ్ గెలుచుకున్నారు. ములుగు జిల్లా తరఫున ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగంలో నాచురల్ ఫార్మింగ్ థీమ్ చేసిన ఆవిష్కరణకు ఈ గుర్తింపు లభించింది. గైడ్ టీచర్ ప్రణీత్, కరస్పాండెంట్ సురేందర్ను డీఈవో పాణిని, డీఎస్ఓ జయదేవ్ అభినందించారు.
Similar News
News January 18, 2026
NZతో అమీ తుమీ.. RO-KO జోడీపైనే ఆశలు!

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ 1-1తో సమమైన విషయం తెలిసిందే. నేడు ఇండోర్ వేదికగా సిరీస్ డిసైడర్ జరగనుంది. రెండో వన్డేలో రాహుల్, గిల్ మెప్పించినా.. రోహిత్, కోహ్లీ ఇద్దరూ రాణించలేకపోవడం మైనస్ అయ్యింది. ముఖ్యంగా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అర్ష్దీప్కు అవకాశమివ్వాలని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గం.కు స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్లో లైవ్ చూడొచ్చు.
News January 18, 2026
ఇవాళ ఈ తప్పులు అస్సలు చేయకండి!

నేడు మౌని అమావాస్య కావడంతో సముద్ర/గంగానది స్నానం, ఉపవాసం, మౌనవ్రతం, పూర్వీకులకు తర్పణం, దానాలు చేయడం మంచిది. వ్రత ఫలితం దక్కాలంటే ఈ తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘కోపం తెచ్చుకోవడం, ఆర్గ్యుమెంట్స్, అనవసర సంభాషణలు, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పడం, నెగటివ్ థింకింగ్ మానుకోవాలి. సోమరితనాన్ని వదిలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి’ అని సూచిస్తున్నారు.
News January 18, 2026
నేడు ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం

డబ్బు చేతిలో నిలవక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. కుంకుమపువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణావర్త శంఖంలో పోసి పూజగదిలో ఉంచాలి. అనంతరం ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ‘ఓం శ్రీ మహాలక్ష్మిదేవ్యై నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు భక్తితో జపించాలి. చొల్లంగి సంగమ స్నానం తర్వాత చేసే ఈ చిన్న పరిహారం లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు.


