News March 24, 2025

దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బాపట్ల ఎంపీ సమీక్ష 

image

బాపట్ల ఎంపీ, పార్లమెంట్ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ సోమవారం ఢిల్లీలో దక్షిణ మధ్య రైల్వే సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గంలోని 62 లెవెల్ క్రాసింగ్ స్థితిని సమీక్షించారు. ప్రజలు ప్రమాదాలు, అసౌకర్యాలకు గురికాకుండా ఉండటానికి 62 ఆర్ఓబీలు, ఆర్‌యూబీల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరినట్లు ఎంపీ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.

Similar News

News October 25, 2025

విశాఖ: డెలివరీ బ్యాగ్‌లో గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్

image

డెలివరీ బ్యాగులను అడ్డుగా పెట్టుకుని గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పీఎంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. కోమ్మాది ప్రాంతంలో నిర్వహించిన దాడిలో నల్లబిల్లి గణేశ్ (32), సంజయ్‌కుమార్ (29)ని పట్టుకున్నారు. ​వారి నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ ప్రజలను కోరారు.

News October 25, 2025

ALP: విశేష దినాల్లో కార్తీక దీపోత్సవం..!

image

కార్తీక మాసం పురస్కరించుకొని అలంపూర్ ఆలయాల్లో ప్రతి సోమవారం, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య విశేష దినాల్లో సాయంత్రం 6 :00 సామూహిక కార్తీకదీపం నిర్వహిస్తున్నట్లు ఈవో దీప్తి శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు దేవస్థానం తరపున ఉచితంగా ప్రమిదలు, వత్తులు, నూనె ఇస్తామన్నారు. దీపోత్సవం అనంతరం మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, తమలపాకులు, నిమ్మకాయలు ప్రసాదంగా ఇస్తామని తెలిపారు.

News October 25, 2025

WWC: భారత్ సెమీస్‌లో తలపడేది ఈ జట్టుతోనే

image

AUSతో మ్యాచ్‌లో SA ఘోర ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన SA 97 రన్స్‌కే ఆలౌట్ కాగా AUS 16.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. 13 పాయింట్లతో టాప్ ప్లేస్‌ను ఖాయం చేసుకుంది. భారత్ రేపు బంగ్లాతో జరిగే చివరి మ్యాచ్‌లో గెలిచినా నాలుగో ప్లేస్‌లోనే ఉంటుంది. దీంతో ఈనెల 30న రెండో సెమీఫైనల్లో పటిష్ఠ AUSతో IND తలపడనుంది. ఈ గండం గట్టెక్కితేనే తొలి WCకు భారత్ చేరువవుతుంది. తొలి సెమీస్‌లో SA, ENG తలపడతాయి.