News June 11, 2024

దగదర్తిలో విమానం దిగేనా ! 

image

దగదర్తిలో ఎయిర్ పోర్టు నిర్మాణం పదేళ్లుగా హామీగా మిగిలిపోయింది. 2014-19 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. వైసీపీ హయాంలోనూ పనులు చేపట్టలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం, ఆ పార్టీ ఎంపీ రాంమోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కావడంతో దగదర్తి ఎయిర్ పోర్టు కల సాకారం కావాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు.

Similar News

News September 12, 2025

ఆశించిన స్థాయిలో లేని చేప పిల్లల పెంపకం

image

నెల్లూరు జిల్లాలో సుమారు 78 సొసైటీలు, 110 పంచాయతీ చెరువులు ఉన్నాయి. సోమశిల రిజర్వాయర్ నిండడంతో కింది చెరువులకు ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. అయితే చేప పిల్లల పెంపకం కేంద్రాలను గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం 20 లక్షల చేప పిల్లల లక్ష్యం సాధ్యం కాకపోతోంది. సోమశిల, పడుగుపాడు కేంద్రాలు మూతపడి భవనాలు శిథిలమయ్యాయి. ప్రస్తుతం కొద్దిపాటి తొట్టెల్లోనే పిల్లల పెంపకం జరుగుతోంది.

News September 12, 2025

నత్తనడకన రామాయపట్నం పోర్టు పనులు!

image

రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఏడాదికి 138 మిలియన్ టన్నుల కార్గో లక్ష్యంగా 19 బెర్తులతో కూడిన రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టారు. రూ.3,736 కోట్లతో 4 బెర్తుల తొలిదశ నిర్మాణ పనులకు 2022 జూన్‌లో అప్పటి CM జగన్ భూమిపూజ చేశారు. 2024 జనవరిలో తొలి కార్గో షిప్ వచ్చేలా అప్పట్లో పనులు చురుకుగా సాగాయి. ప్రభుత్వం మారడంతో 6 నెలల పాటు పనులు స్తంభించాయి.

News September 12, 2025

మిస్టరీగా కావలి మాజీ MLA జాడ?

image

మాజీ MLA రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నది కావలిలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హత్యాయత్నం కేసులో ఇరుక్కున్న వెంటనే ప్రతాప్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. బెంగళూరులో ఉండొచ్చని కొందరు.. కాదు కాదు ఆయన దేశం దాటి శ్రీలంక వెళ్లుంటారంటూ మరికొందరి ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన జాడ మిస్టరీగా మారింది.