News January 4, 2025

దగదర్తి ఎయిర్ పోర్టు నిర్మాణంపై సీఎం సమీక్ష

image

దగదర్తిలో ఎయిర్ పోర్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగింది. 635 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. త్వరలోనే రామాయపట్నం సమీపంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణం జరగనుండటంతో దగదర్తి ఎయిర్ పోర్టుకు ప్రాధాన్యం పెరిగింది.

Similar News

News January 19, 2025

ఇవాళ సూళ్లూరుపేటకు రానున్న ప్రముఖులు వీరే 

image

సూళ్లూరుపేటలో ఆదివారం ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు నేడు సూళ్లూరుపేటకు రానున్నారు. వారిలో నటి, యాంకర్ అనసూయ, అషు రెడ్డి, యాంకర్ రేణు, సింగర్ గాయత్రి, రఘురామ్, కొరియోగ్రాఫర్ సత్య, చైల్డ్ సింగర్ సాయి వాగ్ దేవి, మిమిక్రీ ఆర్టిస్ట్ షరీఫ్ తదితరులు ఉన్నారు. 

News January 19, 2025

HYD ఓయో రూమ్‌లలో ఉంటూ గంజాయి వ్యాపారం

image

హైదరాబాదు ధూల్‌పేట జాలీ హనుమాన్ దేవాలయం వద్ద ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. వారు మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌కి చెందిన సంజన మాంజా(18), నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాజు(25) ఓయో రూమ్‌లలో అద్దెకు ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నారని వారు తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి వారిని పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 3.625 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

News January 19, 2025

నెల్లూరు: పెరుగుతున్న నిమ్మ ధరలు.. రైతుల్లో ఆనందం

image

రెండు రోజుల నుంచి నిమ్మ ధరలు ఊపందుకున్నాయి. ఇటీవల చలి ప్రభావం ఎక్కువ ఉండడంతో ధరలు ఆశించినంతగా లేక రైతులు ఆందోళన చెందారు. గూడూరు మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ. 25 నుంచి రూ. 35 వరకు పలుకుతున్నాయి. నాణ్యత కలిగిన నిమ్మకాయలు రూ. 45 పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. 50 కేజీల లూజు బస్తా రూ. 2,400 నుంచి 3,300 వరకు అమ్ముతున్నారు. నిమ్మ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.