News April 24, 2024
దగ్గర పడుతున్న గడువు.. నామినేషన్ల జోరు
లోక్ సభ ఎన్నికల నామినేషన్ల గడువు దగ్గర పడుతోంది. ఉమ్మడి జిల్లాలోని 2 స్థానాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులు వరుసగా ఈ 3 రోజుల పాటు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలు ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. NLG, BNG స్థానాలకు ఇప్పటి వరకు ప్రధాన పార్టీల వారు నామినేషన్లు పెద్దగా దాఖలు చేయలేదు. ప్రధాన పార్టీల నుంచి ఒకరిద్దరే నామినేషన్లు వేయగా, స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువమంది నామినేషన్లు వేశారు.
Similar News
News January 20, 2025
యాదగిరి నర్సన్నకు దండిగా నిత్య ఆదాయం
యాదగిరి నర్సన్న ఆలయానికి ఆదివారం భారీగా నిత్య ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భాస్కరరావు తెలిపారు. 2700 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.1,35,000, ప్రసాద విక్రయాలు రూ.20,62,120, VIP దర్శనాలు రూ.9,75,000, బ్రేక్ దర్శనాలు రూ.4,70,100, కార్ పార్కింగ్ రూ.6,50,000, వ్రతాలు రూ.1,38,400, యాదరుషి నిలయం రూ.2,71,187, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.51,40,252 ఆదాయం వచ్చింది.
News January 19, 2025
జాన్పహడ్ సైదన్న జాతరకు వేళాయే
మత సామరస్యానికి ప్రతీక ఆ దర్గా. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. అదే సూర్యాపేట జిల్లాలోని జాన్పహడ్ దర్గా. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కి.మీ. దూరంలో ఈ దర్గా ఉంది. ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు జాన్పహడ్ దర్గా ఉర్సు జరుగనున్నాయి. AP, TG నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉర్సులో పాల్గొని సైదన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకోనున్నారు.
News January 19, 2025
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎస్ఎస్సీ, ఆర్అర్బీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని టీజీ బీసీ ఉపాధి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ ఖాజానజీమ్ అలీ అప్సర్ తెలిపారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 9లోగా వెబ్సైట్ tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.