News July 18, 2024
దమ్మపేట: పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి
పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన దమ్మపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. దమ్మపేట మండలం జమేధారు బంజర్ గ్రామంలో ఇద్దరు చిన్నారులు పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 18, 2024
MSME పాలసీ పటిష్ఠం చేయాలని నిర్ణయం: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలో MSME పాలసీ పటిష్ఠం చేయాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణలో MSME పాలసీ తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ MSME పాలసీ లేదన్నారు. ఆర్థిక వ్యవస్థకు చిన్న, సూక్ష్మ పరిశ్రమలు కీలకమని చెప్పారు. భారీ పరిశ్రమలతో పాటు MSMEలకు తమ సర్కారు అనుకూల వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు.
News September 18, 2024
ఖమ్మం: మిర్చి @ రూ.20,000
వరుస సెలవుల అనంతరం బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. బుధవారం మార్కెట్లో మిర్చి ధర క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్ కు తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి క్రయవిక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు తెలిపారు.
News September 18, 2024
కరకగూడెం:భార్యతో గొడవ.. భర్త సూసైడ్
భార్యతో గొడవపడి పురుగులు మందు తాగి ఓ వ్యక్తి సూసైడ్ చేసుకొని మృతిచెందిన ఘటన కరకగూడెం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన కోవాసి సురేశ్ తన భార్యతో గొడవపడి మనస్తాపం చెంది మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు తెలిపారు.