News February 11, 2025

దమ్మపేట: యువకుడిపై పోక్సో కేసు

image

ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. దమ్మపేటకు చెందిన ఓ విద్యార్థినిని మందలపల్లి గ్రామానికి చెందిన నరేంద్ర బార్గవ్ లైంగికంగా వేధించేవాడు. పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు.

Similar News

News November 21, 2025

FEB 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్?

image

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌లో మరోసారి భారత్-పాక్ తలపడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. IND సెమీస్‌కు క్వాలిఫై అయితే వాంఖడేలో మార్చి 5న ప్రత్యర్థితో మ్యాచ్ ఆడనుందని పేర్కొన్నాయి. అలాగే FEB 7న టోర్నీ ప్రారంభమై అహ్మదాబాద్‌లో మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుందని వెల్లడించాయి. ఇటీవల T20IWC <<18244536>>వేదికలను<<>> ఖరారు చేసిన విషయం తెలిసిందే.

News November 21, 2025

JNTU అభివృద్ధికి సహకరించండి: VC

image

80 ఎకరాల్లో విస్తరించి ఉన్న కూకట్‌పల్లి జేఎన్టీయూ ప్రాపర్టీ టాక్స్‌తో పాటు లీజు చెల్లింపులు లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క‌ను వర్సిటీ వీసీ కిషన్ కుమార్ రెడ్డి కోరారు. ఎంతో మంది విద్యార్థులను JNTU తీర్చి దిద్దిందని, ఎంతో మందికి జీవితాన్నించిందని వెల్లడించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేసి అభివృద్ధికి తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు.

News November 21, 2025

మొగల్తూరులో సినిమా హాల్ పరిశీలించిన జేసీ

image

మొగల్తూరులోని శ్రీదేవి జానకి థియేటర్‌ను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పేరు మార్పుపై వచ్చిన విషయంపై థియేటర్‌ను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రేక్షకుల సౌకర్యం కోసం యాజమాన్యానికి పలు సూచనలు చేశామన్నారు. థియేటర్‌లో ఎగ్జిట్ బోర్డులు, ఫైర్ సేఫ్టీ, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ధియేటర్ సిబ్బందికి సూచించారు.