News January 23, 2025

దరఖాస్తులకు మరో అవకాశం: కలెక్టర్ తేజస్

image

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు సభల్లో 630 మంది రైతు భరోసా, 5540 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 5356 మంది కొత్త రేషన్ కార్డులు, 7166 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News November 23, 2025

OTP విధానంతో పంట విక్రయం: కలెక్టర్ రాజర్షి షా

image

కౌలు రైతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కౌలు రైతులు పత్తితో పాటు సోయాబీన్, మొక్కజొన్న పంటలను కూడా OTP విధానంతో విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. రైతులు తమ సందేహాల నివృత్తికి 6300001597 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

News November 23, 2025

గుంటూరులో నాన్ వెజ్ ధరలు ఇవే.!

image

గుంటూరులో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ.200, విత్ స్కిన్ రూ.180గా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ ధర రూ.1050 పలుకుతోంది. ఇక చేపలు బొచ్చెలు, రాగండి ఇలా రకాలను బట్టి కేజీ రూ.200 నుంచి రూ.280 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 23, 2025

నోబెల్ వచ్చినా దేశం దాటలేని పరిస్థితి

image

ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి విన్నర్ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డిసెంబర్‌ 10న నార్వేలో జరిగే నోబెల్ పురస్కారాల వేడుకకు హాజరైతే, ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటార్నీ జనరల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినందుకు ఆమెకు నోబెల్ బహుమతి ప్రకటించినప్పటికీ, దేశం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.