News April 12, 2025
దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి: ASF అదనపు కలెక్టర్

నిరుద్యోగ యువత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని ASF అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం వాంకిడి ఎంపీడీఓ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవాకేంద్రాన్ని ఆయన సందర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
Similar News
News October 25, 2025
ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్: 6 నెలల్లో 30 వేల మంది బాధితులు

దేశంలో ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్కు వేలాది మంది బాధితులుగా మారుతున్నారు. గత 6 నెలల్లో ఏకంగా 30 వేల మంది రూ.1,500 కోట్లకు పైగా నష్టపోయారని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వెల్లడించింది. బాధితుల్లో 30-60 ఏళ్ల వారే ఎక్కువని, 65% స్కామ్స్ ఢిల్లీ-NCR, బెంగళూరు, హైదరాబాద్లోనే నమోదయ్యాయని చెప్పింది. 26.38%తో బెంగళూరు తొలిస్థానంలో ఉందని, ఢిల్లీలో సగటున ఒక్కొక్కరు 8 లక్షలు నష్టపోయారని పేర్కొంది.
News October 25, 2025
బాబా ఫరీద్ యూనివర్సిటీలో 348 ఉద్యోగాలు

పంజాబ్లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ 348 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఎమ్మెస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 40 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://recruitment.ggsmch.org/
News October 25, 2025
KSRTC బస్సుకు తప్పిన ప్రమాదం

పుట్టపర్తి మండలంలోని వెంకటగారిపల్లి గ్రామ సమీపంలో పుట్టపర్తి-గోరంట్ల ప్రధాన రహదారిపై కర్ణాటక ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల మేరకు.. పుట్టపర్తి నుంచి ప్రయాణికులతో బెంగళూరుకు వెళ్తుండగా బస్సు స్టీరింగ్ కట్ అయింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో డివైడర్ వైపు దూసుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.


