News January 24, 2025
దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో జాగ్రత్తగా నమోదు చేయాలి: కలెక్టర్

ప్రజాపాలన గ్రామ/వార్డు సభల అభ్యంతరాల దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో జాగ్రత్తగా నమోదు చేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న ప్రజాపాలన గ్రామ/వార్డు సభల్లో వచ్చిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే పరిశీలన, అభ్యంతరాల దరఖాస్తుల వివరాల ఆన్లైన్ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు.
Similar News
News February 16, 2025
రూ.62కోట్ల నష్టం తెచ్చిపెట్టిన ఎక్స్ప్రెస్

సాధారణంగా రైళ్లలో చాలా రద్దీ ఉంటుంది. సీటు దొరకడమే కష్టం. అయితే ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై మార్గాల్లో నడిచే తేజస్ ఎక్స్ప్రెస్ ప్రయాణికుల కొరతతో ఇబ్బంది పడుతోంది. గత మూడేళ్లుగా ఈ ట్రైన్ వల్ల రైల్వేశాఖకు రూ.62.88 కోట్ల నష్టం వచ్చింది. దీంతో దీని నిర్వహణ బాధ్యతను రైల్వే IRCTCకి అప్పగించింది. అయినప్పటికీ తగినంతగా ప్యాసింజర్లు లేక నష్టాల మార్గంలో ప్రయాణిస్తోంది.
News February 16, 2025
రామతీర్థంలో 26 నుంచి శివరాత్రి జాతర

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు శివరాత్రి జాతర మహోత్సవం జరగనుంది. 26, 27 తేదీల్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు జాగరణ చేస్తారు. 28న వేద పారాయణం అనంతరం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపిస్తారు. జాతరకు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
News February 16, 2025
ఐఏఎస్ అయ్యి సేవ చేస్తా: జైకిసాన్

అల్లూరి జిల్లా వై.రామవరం మండలం కోట గ్రామానికి చెందిన కె.జైకిసాన్ JEE మెయిన్స్లో సత్తా చాటాడు. ఈ గిరిజన విద్యార్థి 97 పర్సంటైల్ స్కోర్తో ఎస్టి విభాగంలో జాతీయ స్థాయి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. ఐఏఎస్ అయ్యి గిరిజన గ్రామాల్లో సేవ చేయాలన్నదే తన ఆశయమని తెలిపాడు. జైకిసాన్ తండ్రి లక్ష్మణరావు రంపచోడవరం మండల అగ్రికల్చర్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. ఆయనను పలువురు అభినందించారు.