News April 14, 2025

దరఖాస్తు గడువు పొడిగించాలి: యూనుస్ 

image

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువును మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఏఐఎస్ఎఫ్ జనగామ జిల్లా కన్వీనర్ మహమ్మద్ యూనుస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నుంచి 3 రోజులు ప్రభుత్వ సెలవులు రావడంతో నిరుద్యోగులు కుల, ఆదాయ, నివాసం సర్టిఫికెట్ల తీసుకోలేక పోవడంతో పథకానికి దరఖాస్తు చేయలేకపోయారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గడువు పెంచాలని కోరారు.

Similar News

News January 7, 2026

జగిత్యాల: ‘ఓటర్ల జాబితా నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి’

image

ఓటర్ల జాబితా నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం మ్యాపింగ్, ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. కాన్ఫరెన్స్లో జగిత్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్ తదితరులున్నారు.

News January 7, 2026

ములకలచెరువు మద్యం కేసు.. కస్టడీకి నిందితులు

image

ములకలచెరువు కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న నకిరేకంటి రవి(A16), శ్రీనివాస్ రెడ్డి(A23)ని ఎక్సైజ్ పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. మదనపల్లె సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా వీరిద్దరూ ఉన్నారు. 2రోజుల కస్టడీకి తీసుకోగా.. మదనపల్లె ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే వీరిని విచారిస్తారని సమాచారం.

News January 7, 2026

10 ఏళ్ల పిల్లాడికి హార్ట్ ఎటాక్.. రీల్స్ చూస్తుండగా..

image

హార్ట్ ఎటాక్‌తో పెద్దలే కాదు యువకులు, పిల్లలు <<18554317>>చనిపోతున్న<<>> ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. తాజాగా UPలోని అమ్రోహ(D)లో 4వ తరగతి చిన్నారి మరణించాడు. మయాంక్(10) రీల్స్ చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు చేశారని, హార్ట్ ఎటాక్‌కు కారణమేంటో గుర్తించలేకపోయామని చెప్పారు.