News April 3, 2025
దరఖాస్తు తేదీ పొడిగింపు: అదనపు కలెక్టర్ వీరారెడ్డి

రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకునే తేదీని ఏప్రిల్ 14 వరకు పొడగించినందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో జిల్లాలోని అందరు మండల పరిషత్ అభివృద్ది అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పథకం అమలు చేయుటకు తగు సూచనలు జారీచేశారు.
Similar News
News November 4, 2025
‘Admin123’.. అంతా కొట్టేశాడు!!

గుజరాత్ హ్యాకర్ పరిత్ ధమేలియా 2024లో ఢిల్లీ, నాసిక్, ముంబై తదితర నగరాల్లో 50K CCTV క్లిప్స్ తస్కరించాడు. విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లోని ఈ క్లిప్స్ పోర్న్ మార్కెట్లో అమ్మేశాడు. మొదట రాజ్కోట్ పాయల్ ఆస్పత్రిలో గైనకాలజీ టెస్ట్స్ ఫుటేజ్ కోసం CCTV హ్యాక్ చేస్తే పాస్వర్డ్ Admin123 అని తెలిసింది. ఇదే పాస్వర్డ్తో ఇతర నగరాల్లోనూ హ్యాక్ చేశాడు. ఈ Febలో అరెస్టైన పరిత్ నేర వివరాలు తాజాగా బయటకొచ్చాయి.
News November 4, 2025
జీలుగుమిల్లి: ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి

జీలుగుమిల్లి మండలం సిర్రివారిగూడెంలో మంగళవారం ఉదయం ట్రాక్టర్ అదుపుతప్పి అఖిల్ (22) మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీలుగుమిల్లి ఎస్.ఐ వి. క్రాంతికుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 4, 2025
చిత్తూరు: దరఖాస్తులతో రూ.10 లక్షల ఆదాయం

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని 56 పోస్టులకు గత నెల నోటిఫికేషన్ ఇచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 2,093 దరఖాస్తులు వచ్చినట్లు చిత్తూరు DMHO సుధారాణి తెలిపారు. దరఖాస్తుల ఫీజుతో తమ శాఖకు రూ.10.46 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.


