News February 9, 2025
దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న లాంగ్ పెండింగ్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికే అరెస్టు అయిన ముద్దాయిలపై ఛార్జీ షీట్లు దాఖలు చేయాలన్నారు.
Similar News
News November 24, 2025
విశాఖ: మరింత సులువుగా ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు!

ట్రాఫిక్ చలాన్లను సులువుగా చెల్లించేందుకు విశాఖ పోలీసులు కొత్త ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో mPARIVAHAN appలో చలాన్లు చెల్లించేవారు. ప్రస్తుతం PhonePay యాప్లోనూ eChallan & icon enable చేశారు. యాప్లో eChallan ఐకాన్ సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసి.. వాహన నెంబర్ను ఎంటర్ చేస్తే వాహనంపై ఉన్న చలానాలన్నీ కనిపిస్తాయి. అక్కడ చెల్లింపులు పూర్తి చేయొచ్చు.
News November 24, 2025
వరంగల్: నిత్య పెళ్లికూతురుపై కేసు నమోదు..!

నిత్య పెళ్లికూతురుపై <<18370111>>కేసు నమోదు<<>> చేసినట్లు వరంగల్(D) పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ తెలిపారు. చౌటపల్లికి చెందిన దేవేందర్ రావు పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కోడిపల్లి అరుణ-రామారావులను సంప్రదించారు. దీంతో వారు నిమిషకవి ఇందిర అనే మహిళను చూపించగా వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమెకు ఇంతకుముందే వివాహమై కూతురు ఉన్నవిషయం తెలుసుకొని ఫిర్యాదు చేయడంతో ఇందిర, తల్లి లక్ష్మి, అరుణ, రామారావుపై కేసు నమోదు చేశారు.
News November 24, 2025
ప్రజా సమస్యల పరిష్కారం దిశగా గ్రీవెన్స్ డే: ఎస్పీ

ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే విధంగా కృషి చేయడమే లక్ష్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 33 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వినతులను స్వీకరించారు. సంబంధిత ఫిర్యాదులపై వేగంగా స్పందించి పోలీస్ సేవలు అందజేయాలని ఎస్పీ సూచించారు.


