News June 15, 2024
దర్శి: ఈతకు వెళ్లి ఇద్దరి విద్యార్థులు మృతి

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన దర్శిలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దర్శి మండలం లంకోజినపల్లికి చెందిన నవీన్ (16), చందు (16)లు గురువారం ఇద్దరూ బయటకు వెళ్లారు. తర్వాత వీరిద్దరూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికారు. శుక్రవారం ఉదయం దర్శిలోని ఎన్ఎపీ చెరువులో మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 26, 2025
త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు గడువు పెంపు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. త్రీ వీలర్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
News November 26, 2025
దశాబ్దాల డ్రీమ్.. ఫైనల్గా మార్కాపురం డిస్ట్రిక్ట్!

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీని CM చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. సీఎం నిర్ణయంతో దశాబ్దాల కల తీరడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 21 మండలాలతో రాష్ట్రంలో 28వ జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాట్లు చేస్తూ త్వరలో గెజిట్ విడుదలకానుంది.
News November 26, 2025
దశాబ్దాల డ్రీమ్.. ఫైనల్గా మార్కాపురం డిస్ట్రిక్ట్!

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీని CM చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. సీఎం నిర్ణయంతో దశాబ్దాల కల తీరడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 21 మండలాలతో రాష్ట్రంలో 28వ జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాట్లు చేస్తూ త్వరలో గెజిట్ విడుదలకానుంది.


