News March 29, 2024
దర్శి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి

దర్శి సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారా అని చాలా రోజులు అటు ప్రజల్లో, ఇటు ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండేది. వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ దర్శి కూటమి అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి పేరు ఖరారయింది. ఈమె మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనుమరాలు. దర్శి టీడీపీ అభ్యర్థిగా ఇప్పటివరకు అనేకమంది పేర్లు ప్రచారం పొందగా నేటితో ఆ ఉత్కంఠకు తెరపడింది.
Similar News
News November 14, 2025
ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.
News November 14, 2025
ప్రకాశం: వచ్చేనెల ఒకటి నుంచి సీజనల్ హాస్టళ్లు ప్రారంభం.!

ప్రకాశం జిల్లాలో వలసదారుల పిల్లల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి సీజనల్ హాస్టల్లను వచ్చేనెల 1 నుంచి ప్రారంభించనున్నట్లు DEO కిరణ్కుమార్ వెల్లడించారు. సీఎస్పురం మండలం పెదరాజుపాలెం, గుంతచెన్నంపల్లి, చీమకుర్తి మండలం పినాయుడుపాలెం, గిద్దలూరు మండలం త్రిపురవరం, కొంగలవీడు, తర్లుపాడు నాజెండ్లముడుపులలో హాస్టల్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి నిర్వహణకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 14, 2025
17న ఒంగోలులో కలెక్టర్ మీకోసం కార్యక్రమం

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 17వ తేదీన కలెక్టర్ మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గత సోమవారం కనిగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.


