News April 28, 2024
దర్శి: నిద్రిస్తున్న బాలికపై అత్యాచార యత్నం

బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన ముండ్లమూరు మండలంలో శనివారం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, తల్లిదండ్రులతో కలిసి ఇంటి మేడపై నిద్రిస్తోంది. దోమలు కుడుతున్నాయని సోదరుడితో కలిసి కిందికి దిగి ఇంటి వరండాలో నిద్రపోయింది. అదే గ్రామానికి చెందిన బ్రహ్మయ్య బాలిక నోరు మూసి, అరిస్తే చంపేస్తానని బెదిరించి, అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News May 8, 2025
పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ఒంగోలు మండలం త్రోవగుంట పొగాకు వేలం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా గురువారం సందర్శించారు. అక్కడ పొగాకు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కలెక్టర్ను కోరారు. స్పందించిన కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయమైన ధర వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.
News May 7, 2025
ఒంగోలు: మత్స్యకారులకు మెగా చెక్కును అందజేసిన కలెక్టర్

ప్రతి ఏటా 2 నెలల పాటు ఉండే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాల జీవనం కోసం ఇచ్చే భృతిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మెగా చెక్కును మత్స్యకారులకు అందజేశారు.
News May 7, 2025
ఒంగోలు: మూగజీవుల పాలిట ప్రాణదాతలు పశు వైద్యులు

మూగజీవుల పాలిట ప్రాణదాతులుగా పశు వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శనివారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పశువైద్య దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పశు సంవర్థక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పంపిన సందేశాన్ని వినిపించారు.