News April 13, 2025
దర్శి: మహిళ దారుణ హత్య

దర్శికి చెందిన అన్నిబోయిన లక్ష్మి (45) కురిచేడు మండలం బోధనంపాడు వద్ద దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం పొలాల్లో లక్ష్మిని గుర్తుతెలియని వ్యక్తి రాయితో కొట్టి చంపేశాడు. తరువాత అతను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 8, 2026
వైఎస్ జగన్ను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట

చెన్నైలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ జగన్ మోహన్ రెడ్డి, మాగుంట ఇరువురూ పలకరించుకున్నారు. మాగుంటను జగన్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో రాజకీయాలు ఏమి లేవని సమాచారం.
News February 8, 2026
పాకల బీచ్ ఫెస్టివల్ కు రానున్న ప్రముఖ యాంకర్

సింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద ఈనెల 14, 15వ తేదీలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్కు ప్రముఖ యాంకర్ సుమ రానున్నారు. ఇదే విషయాన్ని మంత్రి స్వామి సైతం వెల్లడించారు. రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించే ఫెస్టివల్కు పలువురు కమెడియన్లు సైతం రానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్న నేపథ్యంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.
News February 8, 2026
యర్రబాలెం సైనికుడికి సేవా మెడల్

కంభం మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన దర్రె పుల్లయ్య ఆర్మీలో సాహసోపేత సేవలకుగాను సేవా మెడల్ అందుకున్నారు. మద్రాస్ రెజిమెంట్లో విధులు నిర్వహిస్తున్న ఆయన 2024లో నార్త్ గ్లేసియర్లో 200 అడుగుల లోతులో పడిన ఇద్దరు సైనికులను ప్రాణాలకు తెగించి కాపాడారు. ఈ సాహసానికి గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన సేవా మెడల్ను అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో శనివారం ఆర్మీ అధికారులు అందజేశారు.


