News May 29, 2024
దర్శి: స్నేహితులతో సరదా ఈత.. ప్రాణం తీసింది
తాళ్లూరు మండలంలోని రామభద్రపురానికి చెందిన మణికంఠరెడ్డి ఆదివారం రామతీర్థం రిజర్వాయర్లో గల్లంతైన విషయం తెలిసిందే. మణికంఠరెడ్డి తన మిత్రులతో కలిసి ఆదివారం రామతీర్థం రిజర్వాయర్లో సరదాగా ఈతకెళ్లి అక్కడ ఈతకొడుతూ లోపలికి వెళ్లి కనిపించకుండా పోయాడు. ఆరోజు నుంచి గాలింపు చర్యలు చేపట్టగా, మంగళవారం మృతదేహం ఒకపక్కకు కొట్టుకొని వచ్చింది. మణికంఠ మృతితో రామభద్రపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 1, 2024
ఒంగోలు: పింఛన్ల పంపిణీలో పాల్గొన్న కలెక్టర్
ఒంగోలులో నిర్వహించిన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతి పెన్షన్ దారుడికి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ సుజాత, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు.
News October 1, 2024
అక్టోబర్ 2 నుంచి గ్రామ సభలు: ప్రకాశం కలెక్టర్
ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టే పనులను గుర్తించేందుకు అక్టోబర్ 2వ తేదీ గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి సోమవారం మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రజల అభిప్రాయాలను, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాస్తవ ప్రణాళికలు రూపొందించాలన్నారు.
News October 1, 2024
అక్టోబర్ 2 నుంచి గ్రామ సభలు: ప్రకాశం కలెక్టర్
ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపట్టే పనులను గుర్తించేందుకు అక్టోబర్ 2వ తేదీ గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి సోమవారం మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ప్రజల అభిప్రాయాలను, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాస్తవ ప్రణాళికలు రూపొందించాలన్నారు.