News December 1, 2024
దళిత సమ సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి దామోదర్

రాష్ట్రంలో దళిత సమ సమాజ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో నిర్వహించిన రైతు పండుగ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేతో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం సమంగా అందిస్తూ ముందుకు సాగుతామన్నారు.
Similar News
News November 14, 2025
17న ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపికలు

ఉమ్మడి మెదక్ జిల్లా టేబుల్ టెన్నిస్ మహిళలు, పురుషులు, 19 సంవత్సరాల లోపు బాల, బాలికలు క్రీడాకారుల ఎంపిక ఈ నెల 17న మెదక్ గుల్షన్ క్లబ్లో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ కె.ప్రభు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 10 గంటలకు మెదక్ బస్ డిపో వద్ద గల గుల్షన్ క్లబ్లో ఆధార్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 94404 90622 సంప్రదించాలన్నారు.
News November 14, 2025
మెదక్: ‘టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలి’

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష మినహాయింపు కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించాలని
మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును జిల్లా PRTU TS అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు మేడి సతీష్ రావు, సామ్యా నాయక్, గౌరవాధ్యక్షులు సబ్బని శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో చర్చించనున్నట్లు హామీ ఇచ్చారు.
News November 14, 2025
పోలీస్ మైదానం పనులు పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావువాస రావు

పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ మైదానం పనులను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మైదానం నిర్మాణాన్ని వేగవంతం చేసి, పోలీస్ సిబ్బంది వినియోగానికి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ మైదానం సిబ్బంది శారీరక దారుఢ్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.


