News December 1, 2024

దళిత సమ సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి దామోదర్

image

రాష్ట్రంలో దళిత సమ సమాజ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించిన రైతు పండుగ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేతో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం సమంగా అందిస్తూ ముందుకు సాగుతామన్నారు.

Similar News

News December 12, 2025

ప్రచారం ముగిసింది.. ప్రలోభం మిగిలింది !

image

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక ఓటర్లను ప్రభావితం చేయడం మిగిలింది. మెదక్ నియోజకవర్గంలో మెదక్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం చేశారు.

News December 12, 2025

మెదక్: రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్, 163 BNSS అమల్లో ఉంటాయని చెప్పారు. ర్యాలీలు, ప్రచారం, గుమిగూడడం పూర్తిగా నిషేధం. ఎన్నికలు శాంతియుతంగా జరుగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.

News December 12, 2025

మెదక్‌లో ప్రశాంతంగా తొలి విడత పోలింగ్ పూర్తి

image

మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రెండో, మూడో విడతల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసిన సిబ్బందికి, ముఖ్యంగా పెద్ద ఎత్తున పాల్గొన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముందు విడతల మాదిరిగానే 14, 17 తేదీల పోలింగ్‌ను నిర్వహించేందుకు అధికారులను కలెక్టర్ సూచించారు.