News February 26, 2025

దస్తూరాబాద్‌: పురుగుమందు తాగి ఒకరి సూసైడ్

image

దస్తూరాబాద్ మండలంలోని మున్యాల గోండుగూడెం గ్రామానికి చెందిన పుర్క జగన్ (45) మంగళవారం పురుగుమందు తాగి మృతి చెందినట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అప్పుల పాలు కావడంతో మంగళవారం పుర్క జగన్ తన నివాసంలో గుర్తు తెలియని పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు SI నమోదు చేశారు.

Similar News

News October 22, 2025

ఆలయాల్లో ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి: ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర

image

VJA: కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఇతర ఆలయ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివస్తారని, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్నాన ఘాట్లు, రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయం, మహిళలు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.

News October 22, 2025

జగిత్యాల: తీవ్ర జ్వరంతో ఏడేళ్ల చిన్నారి మృతి

image

జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన మల్యాల రవి కుమార్తె హృదయశ్రీ(7) తీవ్ర జ్వరంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం మృతిచెందింది. పది రోజులుగా కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్న వయసులోనే హృదయశ్రీ మృతిచెందడంతో మల్యాల గ్రామంలో విషాదం నెలకొంది.

News October 22, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా చెక్‌పోస్టులు మూసివేత

image

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రవాణా చెక్‌పోస్టులు మూతపడనున్నాయి. సాయంత్రం 5 గంటలలోపు రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ చెక్‌పోస్టులను, కార్యాలయాలను మూసివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఏసీబీ దాడుల్లో అవినీతి బయటపడిన ముత్తగూడెం, పాల్వంచ చెక్‌పోస్టులతో సహా అన్ని కేంద్రాలు మూతపడనున్నాయి.