News March 27, 2025

దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

image

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్‌కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు.  రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది. ఆమె ఎంతో గ్రేట్ కదా..!

Similar News

News November 11, 2025

రేపు అన్నమయ్య జిల్లాకు CM చంద్రబాబు

image

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లి పర్యటనలో భాగంగా రేపు ఉదయం 9:10 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 10:40 నిమిషాలకు చిన్నమండెం చేరుకోనున్నారు. ప్రభుత్వ పక్కా గృహాల్లో గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొని తిరిగి సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు బయలుదేరి విశాఖపట్నం వెళ్లనున్నారు.

News November 11, 2025

కురుమూర్తి స్వామి హుండీ లెక్కింపు రూ.79.68 లక్షల ఆదాయం

image

మహబూబ్‌నగర్ జిల్లా అమ్మాపురం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో 2024 బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం మూడు హుండీల లెక్కింపు జరిగింది. నగదు రూపంలో మొత్తం రూ.79,68,810 ఆదాయం సమకూరినట్లు పాలక మండలి చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కార్యనిర్వాహణాధికారి మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇందులో మొదటి హుండీలో రూ.25,54,805, రెండో హుండీలో రూ.22,78,894, మూడో హుండీలో రూ.31,35,111 గా ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

News November 11, 2025

KNR: అర్హత లేనివారికి కొలువులు.. జీతాలు..!

image

2024- DSC టీచర్ పోస్టులు, స్పోర్ట్స్ కోటా SGT పోస్టుల నియామకాల్లో జాతీయ క్రీడాకారులకు అన్యాయం చేశారనే ఆరోపణలపై ప్రభుత్వం ఇటీవల రీవెరిఫికేషన్‌కు ఆదేశించింది. విచారణలో 22మంది అనర్హులని తేలింది. విద్యా, స్పోర్ట్స్ శాఖల మధ్య సమన్వయ లోపంతో అర్హత లేనివారు కొలువు చేస్తున్నారు. నివేదికను బయటపెడితే అక్రమార్కుల జాబ్స్ తీసేయాల్సి వస్తుందనే నెపంతో ఈ ఫైల్‌ను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.