News March 27, 2025
దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు. రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది. ఆమె ఎంతో గ్రేట్ కదా..!
Similar News
News January 5, 2026
మహిళల భద్రతకు ‘పోష్’ కమిటీలు తప్పనిసరి: కలెక్టర్

పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నివారించేందుకు ‘పోష్’ చట్టం-2013ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలని, అందులో సగం మంది మహిళలే ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ సంస్థలు నెల రోజుల్లోగా ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని గడువు విధించారు.
News January 5, 2026
గొర్రెల పెంపకం – సాంద్ర పద్ధతి అంటే ఏంటి?

సాంద్ర పద్ధతిలో గొర్రెలు ఎప్పుడూ పాకల్లోనే ఉంటాయి. వీటికి నిర్ణీత మోతాదులో పచ్చిగడ్డి, దాణాను ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. జీవాల లెక్కింపు, మందులు, టీకాలు వేయడం ఈ విధానంలో సులభంగా ఉంటుంది. పశుగ్రాసం వృథాకాదు. అయితే పాకలను పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్లలోనికి గాలి వెలుతురు సరిగా ప్రసరించేలా చూడాలి. పచ్చి పశుగ్రాసాలను చాఫ్ కట్టర్తో చిన్న ముక్కలుగా చేసి దాణా తొట్లలో అందించాలి.
News January 5, 2026
మక్తల్: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కెమిస్ట్రీలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఈ నారాయణ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో 55% మార్కులతో పాసై ఉండాలని అలాగే నెట్, సెట్, పీహెచ్డీ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 8వ తేదీన ఎంపిక పరీక్ష ఉంటుందన్నారు.


