News March 27, 2025
దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు. రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది.
Similar News
News October 15, 2025
వాట్సాప్లో మరో కొత్త ఫీచర్!

యూజర్లు తమకు ఇష్టమైన కాంటాక్టుల స్టేటస్లు మిస్ అవకుండా నోటిఫికేషన్ వచ్చేలా కొత్త ఫీచర్ను వాట్సాప్ ట్రయల్ చేస్తోంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.25.30.4 వెర్షన్లో ఈ ట్రయల్ కొనసాగుతోంది. యూజర్లు తమకు ఇష్టమైన కాంటాక్ట్ స్టేటస్పై క్లిక్ చేసి పైన త్రీ డాట్స్పై క్లిక్ చేయాలి. అక్కడ ‘Get notifications’ ఆప్షన్ను ఎంచుకుంటే, ఆ కాంటాక్ట్ స్టేటస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.
News October 15, 2025
తిరుపతి: తాగి స్కూల్కు.. తర్వాత సూసైడ్

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాద ఘటన వెలుగు చూసింది. కొంగరవారిపల్లె ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడు మద్యం తాగి స్కూల్కు వచ్చాడు. తోటి విద్యార్థులు గమనించి టీచర్కు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని HM గదిలోకి తీసుకెళ్లి మందలించి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. భయపడిన విద్యార్థి స్కూల్ గోడ దూకి పారిపోయి ముంగిలిపట్టు వద్ద రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.
News October 15, 2025
టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన నారాయణపేట కలెక్టర్

నారాయణపేటలోని బహర్పేటలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈరోజు ప్రారంభించారు. ఈ వ్యాధి పీకార్నో వైరస్తో సోకుతుందని ఆమె తెలిపారు. రైతులు నష్టాల బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈకార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. పశువులకు సమయానికి టీకాలు వేయించాలని, ప్రభుత్వం అందిస్తోన్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.