News January 31, 2025
దాచేపల్లి: ముగ్గురు మైనర్ బాలుల మిస్సింగ్.. వీడిన మిస్టరీ

దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు బాలుర మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిన పిల్లల ఆచూకిని పోలీసులు సాంకేతిక సహకారంతో గుర్తించారు. ముగ్గురు మైనర్ బాలురు ఇర్ల శ్రీనివాస్ రావు (15)మీసాల డేవిడ్ రాజు (15 ), చర్లపల్లి నగేశ్ కృష్ణ (15) ఇంటి నుంచి వెళ్లిపోయారు. దాచేపల్లి ఎస్ఐలు సౌందర్య రాజన్, పాపారావు పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు.
Similar News
News November 21, 2025
ప్రకాశం: స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి

స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి ధర్తీమాతా బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ధర్తీ మాత బచావో అభియాన్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తమ పొలాల నేల పరిస్థితులను మెరుగుపరచడానికి అవసరమైన ఎరువులను వినియోగించేలా అధికారులు సూచించాలన్నారు.
News November 21, 2025
IPSల బదిలీ.. సిటీకి కొత్త బాస్లు

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. CID డీఐజీగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, నార్కోటిక్ SPగా పద్మజా, మల్కాజిగిరి DCPగా శ్రీధర్, సౌత్ జోన్ DCPగా కిరణ్ ఖారే, టాస్క్ఫోర్స్ DCPగా వైభవ్ గైక్వాడ్, ఎస్ఎంఐటీ డీసీపీగా రూపేశ్, గవర్నర్ ఏడీసీగా పి.సుభాష్, టీజీ ట్రాన్స్కో ఎస్పీగా శ్రీనివాస్, రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణశేఖర్ను నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
News November 21, 2025
BREAKING: ఆసిఫాబాద్ SPగా నితిఖా పంత్

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొమురం భీమ్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నితిఖా పంత్ నూతన ఎస్పీగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.


