News March 5, 2025

దాచేపల్లి: సచివాలయ ఉద్యోగి వీడియో.. స్పందించిన లోకేశ్

image

పల్నాడు జిల్లా దాచేపల్లిలో సచివాలయ ఉద్యోగి పెన్షన్ డబ్బులతో పారిపోయాడు. ఈ మేరకు నిన్న క్షమించండి, డబ్బులు కట్టేస్తానంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. మనుషులుగా తప్పులు చేస్తుంటాం, కానీ వాటి నుంచి మంచి నేర్చుకోవటం ముఖ్యం. మీ కుటుంబానికి తొలి ప్రాధాన్యత ఇవ్వండి. జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లకండి అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

Similar News

News October 20, 2025

18 నెలల్లో ఒక్క దీపమైనా వెలిగిందా: జగన్

image

AP: కూటమి ప్రభుత్వం ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో 18 నెలల్లో ఒక్కటైనా వెలిగిందా అని YS జగన్ ప్రశ్నించారు. ‘రూ.3వేల నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500, రైతులకు ఏడాదికి రూ.20,000, పిల్లలకు ఏటా రూ.15,000, ఇంటింటికీ ఏటా 3 ఉచిత సిలిండర్లు, ఉద్యోగులకిచ్చిన హామీలు.. ఇవన్నీ వెలగని దీపాలే కదా?’ అని ట్వీట్ చేశారు. తామందించిన 30 పథకాలు అనే దీపాలను ఆర్పేసి చీకటికి ప్రతినిధులయ్యారంటూ విమర్శించారు.

News October 20, 2025

REWINED.. వరంగల్‌లో ఇదే తరహా తిరుగుబాటు..!

image

నిజామాబాద్‌లో రియాజ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే జనగామలో కూడా ఎస్కార్ట్ పోలీసులపై తిరగబడ్డ ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపిన ఘటన 2015 ఏప్రిల్ 7న జరిగింది. ఐఎస్ఐ ఉగ్రవాదిగా ఉన్న వికారోద్దీన్‌ను హైదరాబాద్ కోర్టుకు తరలిస్తుండగా జనగామ ప్రాంతంలో మల విసర్జన కోసం ఆగారు. ఆ సమయంలో పోలీసులపై తిరుగుబాటు చేయడంతో కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందారు.

News October 20, 2025

వీటిని పాటిస్తే అంతా ఆరోగ్యమే: వైద్యులు

image

శరీర భాగాల ఆరోగ్యం కోసం రోజూ చేయాల్సిన పనులను వైద్యులు సూచిస్తున్నారు. ‘మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఉదయాన్నే నీరు తాగండి. మెదడు & హార్మోన్ల కోసం రోజూ కోడిగుడ్లు తినండి. నడక & వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉదయం అల్లం నీరు తాగితే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. సూర్యకాంతి వల్ల చర్మం ప్రకాశిస్తుంది. నిద్రకు ముందు పచ్చి వెల్లుల్లి తింటే టెస్టోస్టిరాన్ పెరుగుతుంది’ అని సూచిస్తున్నారు. Share it