News March 21, 2025
దాడి కేసులో ఇద్దరికి రిమాండ్: వాంకిడి ఎస్సై

వాంకిడి మండలంలోని ఓ బిర్యాణి హోటల్ యజమానిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం..ఈ నెల 18న వాంకిడిలోని ఓ బిర్యానీ హోటల్లో రవిచంద్ర కాలనీకి చెందిన కొండ సంతోష్, పస్తం ఇషాక్ మద్యం మత్తులో బిర్యానీ తినడానికి వెళ్లారు. ఈ క్రమంలో హోటల్ యజమానితో గొడవకు దిగి దాడి చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
Similar News
News November 17, 2025
న్యాయ చట్టాలపై అవగాహన కల్పించాలి: నాగరాణి

న్యాయపరమైన చట్టాలపై రిటైర్డ్ ఉద్యోగులు ఇతరులకు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నాగరాణి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనంలో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో పాటు, తెలిసినవారికి న్యాయ చట్టాల గురించి తెలియజేయాలని సూచించారు.
News November 17, 2025
న్యాయ చట్టాలపై అవగాహన కల్పించాలి: నాగరాణి

న్యాయపరమైన చట్టాలపై రిటైర్డ్ ఉద్యోగులు ఇతరులకు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నాగరాణి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనంలో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో పాటు, తెలిసినవారికి న్యాయ చట్టాల గురించి తెలియజేయాలని సూచించారు.
News November 17, 2025
19న నల్గొండలో జాబ్ మేళా

ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈనెల 19న ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఐటీఐ క్యాంపస్లో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన వారు నల్గొండ, హైదరాబాద్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. పదో తరగతి, గ్రాడ్యుయట్, D/B/M- Pharmacy చదివిన వారు అర్హులని తెలిపారు.


