News March 21, 2024
దాడి చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలి : టీడీపీ

ప్రత్తిపాడు అసెంబ్లీ బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రామాంజనేయులుపై దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు గురువారం గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కావాలని వైసీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. వైసీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని వివరించారు.
Similar News
News April 12, 2026
CRDA చట్టానికి కొత్త మెరుగులు.. మార్పులకు సర్కార్ సిద్ధం!

అమరావతి రాజధాని అభివృద్ధికి మరింత వేగం పెంచేలా సీఆర్డీఏ చట్టంలో కీలక సవరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. పాలనను సరళీకరించి, ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా పీపీపీ (PPP) విధానం, కొత్త ఆదాయ వనరుల అన్వేషణపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిపుణుల కమిటీ రూపొందిస్తున్న ముసాయిదా ఆధారంగా త్వరలోనే నూతన చట్టం రూపుదిద్దుకోనుంది.
News April 12, 2026
CRDA చట్టానికి కొత్త మెరుగులు.. మార్పులకు సర్కార్ సిద్ధం!

అమరావతి రాజధాని అభివృద్ధికి మరింత వేగం పెంచేలా సీఆర్డీఏ చట్టంలో కీలక సవరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. పాలనను సరళీకరించి, ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా పీపీపీ (PPP) విధానం, కొత్త ఆదాయ వనరుల అన్వేషణపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిపుణుల కమిటీ రూపొందిస్తున్న ముసాయిదా ఆధారంగా త్వరలోనే నూతన చట్టం రూపుదిద్దుకోనుంది.
News April 11, 2026
GNT: కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు కానిస్టేబుళ్లు

గుంటూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కోర్టుకు ప్రత్యేకంగా కానిస్టేబుళ్లను నియమించనున్నారు. CMS సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని, కేసుల పురోగతి, నిందితుల హాజరు, సాక్ష్యాల సమర్పణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. ఈ విధానం ద్వారా కేసుల పరిష్కార వేగం పెరిగి బాధితులకు త్వరిత న్యాయం అందుతుందని DCRB సీఐ ప్రభాకర్, CMS సీఐ ధర్మేంద్ర బాబు తెలిపారు.


