News September 13, 2024
దాతృత్వంలో ప.గో జిల్లా ప్రథమ స్థానం: కలెక్టర్

వరద బాధితులకు సహాయం అందించటంలో ప.గో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం అన్నారు. 13 మంది దాతలు సహాయంతో రూ.47,88,500/- లు వరద బాధితులకు నగదు, 4.09 లక్షల ఆహార పొట్లాలు, 1.85 లక్షల వాటర్ బాటిల్స్, 1.10 లక్షల వాటర్ ప్యాకెట్లు, 9,500 బన్నులు, 21,400 రస్కులు, 1.62 బిస్కెట్ ప్యాకెట్లు, 25 కేజీల రైస్ బ్యాగ్స్ 700 అందజేయడం జరిగింది అన్నారు.
Similar News
News October 20, 2025
భీమవరం: ఈనెల 23న ఎంపీడీఓ కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్

AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 23న భీమవరం MPDO కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్ జరగనుంది. 18-35 సంవత్సరాల నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి పి.లోకమాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.inలో నమోదు చేసుకోవాలని, వివరాలకు 86885 94244 ఈ నంబర్కు సంప్రదించాలన్నారు.
News October 20, 2025
నరసాపురంలో కూతురిపై తండ్రి అత్యాచారం

నరసాపురంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎస్ఐ విజయలక్ష్మి వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. కుమార్తె(13) 9వ తరగతి చదువుతోంది. భర్త మద్యానికి బానిసయ్యాడు. జులైలో కుమార్తె(13)పై మద్యం మత్తులో తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల తల్లి గల్ఫ్ నుంచి వచ్చింది. విషయం తెలుసుకుని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.
News October 20, 2025
భీమవరం: నేడు పీజీఆర్ఎస్ రద్దు

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం దీపావళి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.