News January 28, 2025
దామరగిద్ద: అనుమానాస్పద స్థితిలో.. చిరుత మృతి

దామరగిద్ద మండలం ఉడుమలగిద్ద గ్రామ సమీపంలోని గుట్టల మధ్య బండరాల్లో ఇరుక్కుని అనుమానాస్పద స్థితిలో ఓ చిరుత మృతి చెందింది. మంగళవారం స్థానిక వ్యవసాయదారులు సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు చేరవేశారు. సంబంధిత ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫారెస్ట్ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారని సమాచారం. చిరుత మృతికి గల కారణాలు తెలుసుకొని విచారణ చేపడుతామన్నారు.
Similar News
News February 7, 2025
లింగంపేట్: దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

లింగంపేట్ మండలం కోమట్ పల్లి గ్రామంలో శుక్రవారం కొందరు అపరిచిత వ్యక్తులను స్థానికులు పోలీస్లకు అప్పగించారు. గ్రామంలో జాతకాలు చెప్తామని, మీ ఇంట్లో అశుభం జరుగుతుందని గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేసినట్లు స్థానికులు తెలిపారు. వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
News February 7, 2025
తిరుమలలో దంపతుల ఆత్మహత్య

తిరుమలలో విషాద ఘటన జరిగింది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాసులు నాయుడు(60), అరుణ(55) దంపతులు తిరుమల నందకం గెస్ట్ హౌస్లో గురువారం రూము తీసుకున్నారు. నిన్నటి నుంచి బయటకు రాకపోవడంతో టీటీడీ సిబ్బంది పోలీసులకు ఇవాళ సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్లు తెరిచారు. దంపతులు ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 7, 2025
మంథని : గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

మంథని పట్టణంలోని గంగపురి ప్రాంతంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.