News June 21, 2024
దామరచర్లలో ఉరి వేసుకుని యువతి సూసైడ్

ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దామరచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. కొత్తగూడెంకు చెందిన దొడ్డా సురేశ్ యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తూ పాల్వంచకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 14, 2026
నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

నల్గొండ ఇక కార్పొరేషన్… గెజిట్ విడుదల
మాడుగులపల్లి: చైనా మాంజా నుంచి సేఫ్.. ఐడియా అదిరింది
నల్గొండ: పుర పోరు.. రిజర్వేషన్లపై ఉత్కంఠ
నల్గొండ: భోగి మంటల్లో జీవో ప్రతులు దగ్ధం
కట్టంగూరు: పాలకవర్గాలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక
నల్గొండ: రైస్ మిల్లులు.. అక్రమాలకు నిలయాలు
మిర్యాలగూడ: జిల్లా డిమాండ్.. మళ్లీ తెరపైకి
కట్టంగూరు: ఘనంగా గోదారంగనాథ స్వామి కళ్యాణం
దేవరకొండలో ఆర్టీసీ కార్మికుల నిరసన
News January 14, 2026
NLG: లండన్ వేదికగా చేనేత కళా వైభవం

చండూరుకు చెందిన చేనేత కళాకారుడు చిలుకూరి శ్రీనివాస్ అంతర్జాతీయ వేదికపై భారతీయ చేనేత నైపుణ్యాన్ని చాటనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు లండన్లో జరిగే ‘స్ప్రింగ్ ఫెయిర్’ వర్తక ప్రదర్శనలో చేనేత లైవ్ డెమో ఇచ్చేందుకు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 29న ఆయన లండన్ బయలుదేరనున్నారు. తన ఎంపికకు సహకరించిన కేంద్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
News January 14, 2026
నల్గొండ: 23, 24 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

జిల్లాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ నెల 23, 24 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జర్నలిస్టులు 20 తేదిలోగా నల్గొండ పౌర సంబంధాల అధికారిని సంప్రదించాలన్నారు.


