News February 14, 2025
దామోదరయ్య చిత్రపటానికి కలెక్టర్ నివాళి

ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య చిత్రపటానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ నివాళులర్పించారు. సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్వో విజయసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 20, 2025
జగిత్యాల: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలి మృతి

మల్యాల(M) పోతారం గ్రామానికి చెందిన పున్న లచ్చవ్వ(59) ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతిచెందినట్లు SI నరేష్ తెలిపారు. కాగా మృతురాలు తన సోదరుడి ఇంట్లో నివాసముంటోంది. ఈ క్రమంలో మంగళవారం ఇంటిబయట గడ్డికి నిప్పుపెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు మంటలు అంటుకొని గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సోదరుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.
News November 20, 2025
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేయాలి: జేసీ

రానున్న వారం రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాలలో వరి కోతలు ముమ్మరం కానున్న నేపథ్యంలో, ఖరీఫ్ 2025-26 సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేయాలని జేసీ రాహుల్ అధికారులను ఆదేశించారు. గురువారం జేసీ ఛాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని పరికరాలను రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News November 20, 2025
ఈ అలవాట్లతో రోగాలకు దూరం: వైద్యులు

ఆరోగ్య సమస్యలను డైలీ హ్యాబిట్స్ ద్వారా దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘రోజుకు 10వేల అడుగులు నడిస్తే శారీరక & మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. మెడిటేషన్ చేస్తే ఒత్తిడి & ఆందోళన తగ్గుతుంది. ఒకే సమయానికి నిద్ర పోవడం & మేల్కోవడం చేయాలి. సూర్యరశ్మి తగిలితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్ను తినకపోవడం బెస్ట్. బ్యాలెన్స్ డైట్ తీసుకోండి’ అని సూచిస్తున్నారు.


