News February 14, 2025
దామోదరయ్య చిత్రపటానికి కలెక్టర్ నివాళి

ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య చిత్రపటానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ నివాళులర్పించారు. సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్వో విజయసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 9, 2025
GNT: గ్రీన్ ఛానల్ ద్వారా తరలింపు.. అయినా దక్కని ప్రాణం

తాడేపల్లి (M) కుంచనపల్లికి చెందిన విజయ గోపాలకృష్ణ నిన్న విజయవాడ బెంజ్ సర్కిల్ స్క్రూ బ్రిడ్జి సమీపంలో మృతి చెందారు. గోపాలకృష్ణ విజయవాడలో విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వస్తుండగా బ్రేకులు ఫెయిలైన ట్రాలీ గోపాలకృష్ణ బైక్ను, కారును ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయనను పోలీసులు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాసేపటికి అతను మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 9, 2025
నేడు కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

TG: ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం 10గంటలకు కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వర్చువల్గా ప్రారంభించనున్నారు. పలు కారణాలతో 6 జిల్లాల్లో(ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ములుగు, నల్గొండ, నారాయణపేట్) ఈ కార్యక్రమం జరగదు. కాగా ఈ ఒక్కో విగ్రహానికి రూ.17.50 లక్షల చొప్పున మొత్తం రూ.5.80 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
News December 9, 2025
MBNR: స్వామివారి తలనీలాలకు కోటి రూపాయల టెండర్

తెలంగాణ తిరుపతిగా పేరు ప్రఖ్యాతలుగాంచిన మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం టెండర్లు నిర్వహించారు. పది సంవత్సరాల క్రితం పలికిన విధంగా ఈసారి కూడా కోటి రూపాయలు తలనీలాలకు రెండేళ్ల కాలపరిమితికి ఐదుగురు వ్యాపారులు పాల్గొన్నారు. శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ వారికి దక్కిందని ఆలయ ఈవో శ్రీనివాసరాజు తెలిపారు.


