News February 14, 2025

దామోదరయ్య చిత్రపటానికి కలెక్టర్ నివాళి

image

ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య చిత్రపటానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ నివాళులర్పించారు. సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్‌వో విజయసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 28, 2025

సిద్దిపేట: గంగాపూ‌ర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

image

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పపైకి ద్విచక్ర వాహనం ఎక్కి కిందపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తెనుగువానిపల్లెకు చెందిన రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 28, 2025

విజయవాడలో డయేరియా కేసులు.. వాస్తవమెంత.?

image

న్యూ RRపేటలో మరోసారి డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. వైద్యులు మాత్రం ఇప్పటివరకు ఒక్క కేసు మాత్రమే నమోదైందని, ఇది సాధారణమేనని అంటున్నారు. ఏళ్లనాటి పైపులైన్ల లీకుల కారణంగా కలుషిత నీరు వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి కాలుష్యం జరిగి డయేరియా కేసులు నమోదవుతున్న క్రమంలో అధికారులు వాటర్ బబుల్స్, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు తప్ప, సమస్యకు పరిష్కారం చూపడం లేదు.

News November 28, 2025

GWL: అనైతిక చర్యలకు ఆరేళ్లు నిషేధం: కలెక్టర్‌

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో అనైతిక చర్యలకు పాల్పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని గద్వాల కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. పదవులను వేలం వేయడం, ఓటర్లను డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు భారత శిక్షాస్మృతి ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ఓటర్లపై ఎవరూ ఒత్తిడి చేయరాదని సూచించారు.