News February 14, 2025

దామోదరయ్య చిత్రపటానికి కలెక్టర్ నివాళి

image

ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య చిత్రపటానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ నివాళులర్పించారు. సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్‌వో విజయసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 4, 2025

చంద్రబాబును బొక్కలో పెట్టాలి: జగన్

image

AP: చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేశారని జగన్ విమర్శించారు. ‘చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వేయాలి. ఎవరైనా ఇలాంటి మోసం చేస్తే ఏం చేసేవారు? జైల్లో పెడతారు కదా’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తల్లికి వందనం, ఉచిత సిలిండర్లు అంటూ మోసం చేశారని.. ఉచిత బస్సుకు ఎన్నో నిబంధనలు పెట్టారని ఫైరయ్యారు. నాడు-నేడును పూర్తిగా ఆపేసి, ఇంగ్లిష్ మీడియాన్ని తీసేశారని విమర్శించారు.

News December 4, 2025

WGL: పెరిగిన వండర్ హట్, తగ్గిన తేజా మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌‌లో గురువారం ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. వండర్ హాట్(WH) మిర్చి క్వింటాకు బుధవారం రూ.19 వేలు ధర రాగా, ఈరోజు రూ.19,300 అయింది. 341 రకం మిర్చికి నిన్న రూ.16,500 ధర రాగా, నేడు కూడా అదే దర వచ్చింది. అలాగే తేజ మిర్చి బుధవారం రూ.14,200 పలకగా, ఈరోజు కూడా అదే ధర వచ్చింది. కొత్త తేజ మిర్చి నిన్న రూ.14,800 ధర వస్తే నేడు రూ.14,200కి పడిపోయింది.

News December 4, 2025

ASF: ఊపందుకున్న సోషల్ మీడియా ప్రచారం

image

ASF జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి సోషల్ మీడియాలో ఊపందుకుంది. అభ్యర్థులు అభివృద్ధి హామీలతో పోస్టులు షేర్ చేస్తూ, తమ మేనిఫెస్టోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. సమస్యల పరిష్కారం వంటి హామీలతో గ్రామాల్లో చర్చలు రగులుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వీడియోలు, పోస్టర్లను ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇంస్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. ఎవరి వర్గానికి వారు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.