News January 25, 2025

దామోదర్ క్షేమంగానే ఉన్నాడు: మావోయిస్టు పార్టీ లేఖ

image

ములుగు జిల్లా కాల్వపల్లికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు@ దామోదర్ క్షేమంగా ఉన్నట్లు ఆ పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో సోంబే పేరుతో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఈ నెల 16న 8 వేలమంది పోలీసు బలగాలతో బీజాపూర్ జిల్లాలోని పలు గ్రామాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది కార్మికులు చనిపోయారన్నారు. కాగా పోలీసులు తప్పుడు ప్రకటన చేశారని, దామోదర్ క్షేమంగానే ఉన్నాడని తెలిపారు.

Similar News

News December 3, 2025

సూర్యాపేట: ప్రారంభమైన మూడో విడత నామినేషన్ ప్రక్రియ

image

జిల్లాలోని ఏడు మండలాలకు సంబంధించిన 146 గ్రామ పంచాయతీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 5 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ దశలో సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఈ దశలో మేళ్లచెరువు వంటి పెద్ద గ్రామపంచాయతీలు ఎక్కువగా ఉండటం.. అధిక ఓటర్లు ఉన్న గరిడేపల్లి మండలం ఉండడంతో నామినేషన్లు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

News December 3, 2025

ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆక్టోపస్ ‘మాక్ డ్రిల్’

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆక్టోపస్ డెల్టా టీమ్, గుంటూరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇందులో పాల్గొన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత, ప్రజా రక్షణ కోసమే దీనిని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

News December 3, 2025

124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(C<>BSE<<>>) 124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ/ఎంఈడీ, నెట్/SLAT, పీహెచ్‌డీ, ఎంబీఏ, సీఏ, ICWA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష(టైర్1, టైర్ 2), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cbse.gov.in