News January 25, 2025

దామోదర్ క్షేమంగానే ఉన్నాడు: మావోయిస్టు పార్టీ లేఖ

image

ములుగు జిల్లా కాల్వపల్లికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు@ దామోదర్ క్షేమంగా ఉన్నట్లు ఆ పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో సోంబే పేరుతో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఈ నెల 16న 8 వేలమంది పోలీసు బలగాలతో బీజాపూర్ జిల్లాలోని పలు గ్రామాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది కార్మికులు చనిపోయారన్నారు. కాగా పోలీసులు తప్పుడు ప్రకటన చేశారని, దామోదర్ క్షేమంగానే ఉన్నాడని తెలిపారు.

Similar News

News November 28, 2025

MDK: అన్నా నేను తాగుత లేనన్నా..!

image

ఎన్నికలు రావడంతో ఉమ్మడి MDKలో మద్యంప్రియులు జాగ్రత్తలు పడుతున్నారు. నిత్యం సారా, చీప్‌లిక్కర్ తాగి జేబులు ఖాళీ చేసుకున్న వాళ్లు ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారు. ‘అన్నా ఆరోగ్యం బాగుండట్లేదు. డాక్టర్ చీప్‌లిక్కర్ తాగొద్దన్నారు’ అంటూ పెద్ద మందుకు టెండర్ పెడుతుండటంతో పోటీదారులు ఖంగు తింటున్నారు. నిన్నటి వరకు ఏదో ఒకటి తాగిన వాళ్లు ఇప్పుడు టీచర్స్, 100 పైపర్స్ వంటి బ్రాండ్లను డిమాండ్ చేస్తున్నారట.

News November 28, 2025

MDK: అన్నా నేను తాగుత లేనన్నా..!

image

ఎన్నికలు రావడంతో ఉమ్మడి MDKలో మద్యంప్రియులు జాగ్రత్తలు పడుతున్నారు. నిత్యం సారా, చీప్‌లిక్కర్ తాగి జేబులు ఖాళీ చేసుకున్న వాళ్లు ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారు. ‘అన్నా ఆరోగ్యం బాగుండట్లేదు. డాక్టర్ చీప్‌లిక్కర్ తాగొద్దన్నారు’ అంటూ పెద్ద మందుకు టెండర్ పెడుతుండటంతో పోటీదారులు ఖంగు తింటున్నారు. నిన్నటి వరకు ఏదో ఒకటి తాగిన వాళ్లు ఇప్పుడు టీచర్స్, 100 పైపర్స్ వంటి బ్రాండ్లను డిమాండ్ చేస్తున్నారట.

News November 28, 2025

వరంగల్: ప్రైవేట్ పీఏకు రూ.90 వేలు

image

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఫెయిలైనవారికి మార్కులు కలపడంతో మొదలైన అవినీతి బండారం విజిలెన్సు విచారణలో విస్తుపోయేలా బయటకు వస్తున్నాయి. WGL విజిలెన్సు అధికారుల చేతిలో అవినీతి చిట్టా ఉన్నట్లు తెలిసింది. నోటిఫికేషన్ లేకుండా ప్రైవేట్‌గా ఉద్యోగులను పెట్టుకున్న విషయం బయటకు వచ్చింది. రూ.90 వేల వేతనంతో కాంట్రాక్టు పద్ధతిలో వీసీ పీఏను అంటూ చలామణి అవుతున్న వ్యక్తి బండారం బయటపడింది.